AP News: సీఎం జగన్ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్మార్క్: లంకా దినకర్
సీఎం జగన్ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్మార్క్ అని భాజపా నేత లంకా దినకర్ అన్నారు.
విజయవాడ: సీఎం జగన్ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్మార్క్ అని భాజపా నేత లంకా దినకర్ అన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన చూశామన్నారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడి కలబోతే జగన్ అని అన్నారు. త్రిమూర్తుల కలయికతో రాక్షస పాలన సంహారం తథ్యమని చెప్పారు. సీఎం తట్టా బుట్టా సర్దుకుని నచ్చిన ప్యాలెస్కు వెళ్లడం మంచిదని హితవు పలికారు.
‘‘ఒకసారి వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి ఓటు వేస్తే శతాబ్దం వెనక్కి పోతుంది. 2019కి ముందు అమరావతే రాజధాని అంటూ 2024 నాటికి నిర్వీర్యం చేశారు. మద్య నిషేధం అంటూనే దాన్నే ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్ అంటూనే వారిని బానిసలకన్నా హీనంగా చూస్తున్నారు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటూ ఉప ప్రణాళిక నిధులు గోల్మాల్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి జగన్ స్టిక్కర్లు వేసుకున్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్రం పంపించే నిధులకు బటన్ నొక్కడం తప్ప ఏం చేయలేదు. రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పులకు చేర్చిన ఘనత ఆయనకు దక్కింది’’ అని లంకా దినకర్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..