రేపే ఐదో విడత.. 49 లోక్సభ స్థానాలకు పోలింగ్
సార్వత్రిక సమరంలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది.
ముంబయి, లఖ్నవూ: సార్వత్రిక సమరంలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (రాయ్బరేలీ)తోపాటు రాజ్నాథ్ సింగ్ (లఖ్నవూ), పీయూష్ గోయల్ (ముంబయి-ఉత్తర), స్మృతి ఇరానీ (అమేఠీ), సాధ్వీ నిరంజన్ జ్యోతి (ఫతేహ్పుర్), శంతను ఠాకుర్ (బన్గావ్) తదితర కేంద్రమంత్రులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూకశ్మీర్లోని బారాముల్లా స్థానం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫెరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా సహా మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బెంగాల్లో భద్రత కట్టుదిట్టం
పశ్చిమ బెంగాల్లో సోమవారం ఏడు లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. వాటిలోని 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో ఘర్షణలను నివారించేందుకు ఈసీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మరోవైపు- ఒడిశాలో సోమవారం పోలింగ్ జరగనున్న 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ప్రచార గడువు శనివారంతో ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తూ తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయి. కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళిగా కొవ్వొత్తులతో శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించిన అనంతరం భారీ ఊరేగింపు ప్రారంభమైంది. -
వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయి
సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్పోల్స్ ఏం చెబుతున్నా వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ పేర్కొంది. ‘జూన్ 4న నిష్క్రమించడం ఖాయమైన వ్యక్తి ఈ ఎగ్జిట్ పోల్స్ను సృష్టించారు. మానసికంగా ఆటాడుకునేందుకు ఇలా చేశారు. -
మాకు రికార్డుస్థాయి మద్దతు
ఓటర్లతో మమేకం కావడంలో అవకాశవాద ఇండియా కూటమి విఫలమైందని, వాటి తిరోగామి రాజకీయాలకు తిరస్కరణ ఎదురైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్డీయే కూటమికి రికార్డు స్థాయిలో మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. -
పూర్తయిన సార్వత్రిక సమరం
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. దాదాపు రెండున్నర నెలలుగా దేశవ్యాప్తంగా నెలకొన్న సందడికి తెరపడింది. ఓట్ల లెక్కింపుపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. హ్యాట్రిక్ కోసం ఆరాటపడుతున్న ఎన్డీయే విజయం సాధిస్తుందా, మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమి గెలుస్తుందా అనేది ఈ నెల 4న తేలనుంది. -
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం
సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ స్థానాలను గెల్చుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలోని ఖర్గే నివాసంలో కూటమి నేతలు శనివారం సమావేశమయ్యారు. -
ఓటరే అసలైన విజేత.. ఎన్నికల సంఘం
సార్వత్రిక సమరాన్ని విజయవంతం చేశారంటూ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం సవినయంగా కృతజ్ఞతలు తెలిపింది. అనేక సవాళ్లు, సందేహాలను అధిగమించి వారంతా స్పందించడంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఓటరే అసలైన విజేత అని అభివర్ణించింది. -
దిల్లీ సీఎంకు అంబులెన్సు పంపిన భాజపా నేత గోయెల్
తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ కేజ్రీవాల్ పేర్కొనడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు భాజపా నేత విజయ్ గోయెల్ శనివారం కేజ్రీవాల్ నివాసానికి అంబులెన్సు పంపారు. -
ఓట్ల లెక్కింపునకు 49 మంది పరిశీలకులు
‘‘లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు 49 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు కేటాయించింది. పరిశీలకుల ఆమోదం తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించాం. -
ఎవరూ చావు నోట్లో తల పెట్టి రాష్ట్రం తేలేదు
తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ గొప్పతనాన్ని అసెంబ్లీ మొదటి ప్రసంగంలో కేసీఆరే చెప్పారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి పదేళ్లు పూర్తయిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. -
తెలంగాణలో భాజపాకు రెండంకెల సీట్లు ఖాయం!
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు రాష్ట్రంలో అనుకున్నదాని కంటే మంచి ఫలితాలు వస్తాయని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ లోక్సభ ఎన్నికల రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ శనివారం సాయంత్రం ఎంపీ అభ్యర్థులతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. -
ఫలితాల తర్వాత కాంగ్రెస్లో భారాస విలీనం
‘‘లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో భారాసను విలీనం చేస్తానని, తన జోలికి రావొద్దని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్కు, కాళేశ్వరం కుంగడానికి కేసీఆరే ప్రధాన కారణమని ఆరోపించిన రేవంత్రెడ్డి.. ఆయనపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. -
రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాల్సిందే
-
‘మహబూబ్నగర్ ఎమ్మెల్సీ’ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నేడే
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ఆదివారం వెలువడనుంది. మహబూబ్నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. -
ఎన్డీయే తీన్మార్!
కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించడం లాంఛనమేనని దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో తేల్చిచెప్పాయి!! కమలదళం నేతృత్వంలోని ఎన్డీయే 350 స్థానాలకుపైగా దక్కించుకోవడం ఖాయమని మెజార్టీ సంస్థలు జోస్యం చెప్పాయి. -
తెలంగాణలో నువ్వా.. నేనా
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపాల మధ్యే తీవ్ర పోటీ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. రెండు పార్టీలూ నువ్వా, నేనా అన్నట్లుగా తలపడ్డాయని, మొత్తం 17 స్థానాల్లో ఇరు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు వచ్చే అవకాశాలున్నాయని కొన్ని సంస్థలు పేర్కొనగా.. భాజపా పైచేయి సాధిస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి. -
ఆహ్వానిస్తూనే.. అవమానిస్తారా?
‘ప్రజాజీవితాన్ని క్రమంగా కల్లోలంలోకి నెడుతున్నారు. ప్రశ్నించే వారిని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు. మీ వికృత పోకడలను నిరసిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు హాజరు కారాదని నిర్ణయించాం’ అని భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. -
తెలంగాణను కేసీఆర్ వ్యాపార వస్తువులా మార్చారు
‘కేసీఆర్ ఓ కమర్షియల్ వ్యాపారి. తెలంగాణను వ్యాపార వస్తువులా మార్చి గత పదేళ్లపాటు లాభాలు పొందారు. ఇంకా లాభాలు పొందాలని చూస్తున్నారు’ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. -
కూటమికే పీఠం!
అరాచకం... అభివృద్ధి మధ్య పోరుగా... రాజకీయంగా అత్యంత ఉత్కంఠ, ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన ఎన్డీయే కూటమినే విజయం వరించబోతోందని ఎగ్జిట్పోల్స్ తేల్చాయి. -
ఆర్వోను బెదిరించినా చెవిరెడ్డిపై చర్యల్లేవు
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్..! వారిని బెదిరించడం, అంతుచూస్తామనడం తీవ్రమైన నేరం..! ఆర్వోను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి, అరెస్టు చేయాలి. -
పిన్నెల్లితో ప్రాణహాని.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నందుకు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ఈ నేపథ్యంలో ఆయన్నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున హైకోర్టు ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుచేసి తనకు రక్షణ కల్పించాలని తెదేపా బూత్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్ కోసం 15 కిలోలు తగ్గి
-
సైకిల్పై వెళ్లి ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి
-
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం