BJP: భాజపాను దెబ్బకొట్టినవి ఆ రెండే!
ఏ ఉత్తర భారతమైతే రెండు ఎన్నికల్లో భాజపాకు ఘన విజయం సాధించి పెట్టిందో అదే ప్రాంతం ఈసారి దెబ్బకొట్టింది. అయోధ్యలో రామాలయం నిర్మించామని విస్తృత ప్రచారం చేసుకున్నప్పటికీ కాషాయదళానికి కలిసి రాలేదు.
రిజర్వేషన్ల భయం, రైతుల ఆగ్రహంతో తగ్గిన సీట్లు
సొంత మెజార్టీకి గండి కొట్టినవి అవే
కాషాయ పార్టీని కాపాడని అయోధ్య రాముడు
ఈనాడు, దిల్లీ: ఏ ఉత్తర భారతమైతే రెండు ఎన్నికల్లో భాజపాకు ఘన విజయం సాధించి పెట్టిందో అదే ప్రాంతం ఈసారి దెబ్బకొట్టింది. అయోధ్యలో రామాలయం నిర్మించామని విస్తృత ప్రచారం చేసుకున్నప్పటికీ కాషాయదళానికి కలిసి రాలేదు. గత రెండు ఎన్నికల్లో యూపీలో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలబడిన భాజపా ఈసారి సగానికి సగం బలం కోల్పోయి, సమాజ్వాదీపార్టీ సరసన నిలబడాల్సి వచ్చింది. గత నవంబరులో రాజస్థాన్ ఎన్నికల్లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పది సీట్లను అక్కడ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో ప్రత్యర్థి పార్టీలను చీలికలు పేలికలు చేసినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీని కేసులతో ముప్పుతిప్పలు పెట్టి పైచేయి సాధించాలని చూసినా ఫలితం లేకుండాపోయింది. రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూసినందుకు హరియాణాలో సగం సీట్లను, పంజాబ్లో ఉన్న రెండు సీట్లనూ కోల్పోవాల్సి వచ్చింది.
ఆ అయిదు రాష్ట్రాల్లో పెరిగిన ఆదరణ
ఈసారి మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు భాజపాను ఎక్కువ ఆదరించి, క్రితంసారి కంటే ఎక్కువ సీట్లను కట్టబెట్టాయి. మధ్యప్రదేశ్లో గత రెండు ఎన్నికల్లో సాధ్యంకాని 100% ఫలితాలను ఈసారి సాధించి ఆ రాష్ట్రంపై కాషాయదళం మరోసారి పట్టు సాధించింది. దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, త్రిపురల్లో క్రితంసారి ఉన్న సీట్లను చేజిక్కించుకొని అక్కడి రాజకీయాలపై పట్టును నిలుపుకొంది. కేరళలో బోణీకొట్టి అసాధ్యం అనుకున్న చోట అడుగుపెట్టగలిగింది. తెలంగాణలో సంఖ్యాబలాన్ని రెట్టింపు చేసుకొని ఆ రాష్ట్ర రాజకీయాలను త్రిముఖం నుంచి ద్విముఖంగా మలుపుతిప్పగలిగింది. ఎస్టీలు అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో క్రితంసారి కంటే ఒకసీటు అధికంగా గెలుచుకొని పైచేయి సాధించిన భాజపా.. ఝార్ఖండ్లో మాత్రం అక్కడి ముఖ్యమంత్రి హేమంత్సోరెన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపినందుకు మూడు సీట్లను కోల్పోవాల్సి వచ్చిందనే విశ్లేషణ వినిపిస్తోంది. కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంతో 9 సీట్లను కోల్పోయి భారీగా నష్టపోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు.
ఒక్కో రాష్ట్రం.. భిన్న కారణం
బిహార్లో గతసారి 17కి 17 సీట్లు గెలుచుకొని పెద్దన్న పాత్ర పోషించిన భాజపా ఇప్పుడు 5 సీట్లను కోల్పోయి మణిపుర్ అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపినా కేంద్రంలోని భాజపా నాయకత్వం దాన్ని పెద్ద తీవ్రంగా తీసుకోలేదు. అక్కడ అంతా ప్రశాంతంగానే ఉందని చూపేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అక్కడ రెండుస్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. అస్సాంను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన సీఏఏ కారణంగా ఆ రాష్ట్రంలోనూ ఒక సీటును కోల్పోవాల్సి వచ్చింది. ఆర్టికల్ 370ని రద్దుచేసి, జమ్మూకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసినప్పటికీ లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైనందుకు అక్కడి స్థానాన్ని కాషాయదళం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భాజపాకు అంత బలం వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దుచేస్తారని ప్రతిపక్షాలు చేసిన ప్రచార ప్రభావం ఎస్సీ, ఓబీసీలు అధికంగా ఉండే ఉత్తర్ప్రదేశ్, బిహార్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్లపై బలంగా పడింది. అగ్నివీర్ పథకం పలుచోట్ల వ్యతిరేక ప్రభావం చూపించింది. ముఖ్యంగా యూపీలో భాజపా బలం సగానికి సగం తగ్గిపోయింది. రెండుసార్లు 26కి 26 స్థానాలు గెలిచిన గుజరాత్లో ఈసారి ఒక సీటును భాజపా నష్టపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా నష్టపోవడానికి మోదీ వ్యవహారశైలి ఎంత కారణమైందో, కొత్తగా కొన్ని రాష్ట్రాల్లో బలపడటానికి అంతే దోహదం చేసిందని చెప్పవచ్చనేది విశ్లేషకుల మాట. సుదీర్ఘకాలం సేవలందించిన నేతలను ఒక్కసారిగా పక్కనపెట్టడం కూడా బెడిసికొట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.