Bihar: బిహార్లో కీలక పోరు!
బిహార్లో చివరిదైన కీలక పోరుకు రంగం సిద్ధమైంది. 8 నియోజకవర్గాల్లో 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 134 మంది పోటీలో ఉన్నారు.
1 న చివరి విడత పోలింగ్కు సిద్ధం
లాలు, నీతీశ్లకు ఉత్కంఠ
8 చోట్ల బరిలో 134 మంది
బిహార్లో చివరిదైన కీలక పోరుకు రంగం సిద్ధమైంది. 8 నియోజకవర్గాల్లో 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 134 మంది పోటీలో ఉన్నారు. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోరు సాగనుంది. ఈ విడతలో లాలూ కుమార్తె మీసా భారతి, నీతీశ్ సొంత నియోజకవర్గం ఉండటంతో వారిలో టెన్షన్ నెలకొంది. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు, బాబు జగ్జీవన్రామ్ మనవడైన అన్షుల్ అవిజీత్ ఈ విడతలో బరిలో ఉన్నారు. ఎన్డీయే, ఇండియా కూటమి నేతల విస్తృత ప్రచారంతో నియోజకవర్గాలు హోరెత్తుతున్నాయి.
వ్యవసాయమే దన్ను
అత్యంత పురాతన, ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉన్న నలందా ప్రాంతంలో సారవంతమైన భూములున్నాయి. వ్యవసాయమే ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది. వరి, గోధుమ, పప్పులు ప్రధాన పంటలు. పండ్లు, కూరగాయల సాగూ అధికంగానే ఉంటుంది. బౌద్ధులకు, జైన్లకు పవిత్ర స్థలంగా ఉంది.
2014, 2019లలో జేడీయూ విజయం సాధించింది. ఇప్పటికే మూడు సార్లు గెలిచిన కౌసలేంద్ర కుమార్ మరోసారి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఇండియా కూటమిలోని సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్, లిబరేషన్) తరఫున సందీప్ సౌరభ్ పోటీ చేస్తున్నారు. సొంత జిల్లా కావడంతో నీతీశ్కు గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు నెలకొంది. ఆయన బలమే జేడీయూ అభ్యర్థికి అనుకూలాంశం. నీతీశ్ ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కూడా కలిసివచ్చేదే.
కాయస్థల ఆధిపత్యం
రాజధాని పట్నాలో ఉన్న పట్నా సాహిబ్లో కాయస్థ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. వారి తర్వాత యాదవులు, రాజ్పూత్లు అధికంగా ఉంటారు. కాయస్థలు ఎటు మొగ్గు చూపితే వారిదే విజయం. మొత్తం 21లక్షల మంది ఓటర్లలో 5 లక్షల మంది కాయస్థలే. ఎస్సీలూ ఫలితాన్ని ప్రభావితం చేయగలిగే స్థాయిలోనే ఉన్నారు.
2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అన్షుల్ అవిజీత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో నిలిచారు. గత రెండు ఎన్నికల్లో భాజపాకు మద్దతిచ్చిన కాయస్థలు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తికరం. అన్షుల్ కుశ్వాహా వర్గానికి చెందినవారు. రవిశంకర్ కాయస్థ వర్గంవారు.
యాదవుల పట్టు
రాజధానిలోని మరో నియోజకవర్గం పాటలిపుత్ర. ఇక్కడి 16.5 లక్షల మంది ఓటర్లలో 4లక్షల మంది యాదవులే. 3 లక్షల మంది భూమిహార్లు, లక్ష మంది బ్రాహ్మణులు, 1.7 లక్షల మంది కుర్మీలు ఉన్నారు.
2014, 2019లలో భాజపా నేత రాంకృపాల్ యాదవ్ గెలిచారు. మళ్లీ ఆయనే పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ నుంచి లాలూ కుమార్తె మీసా భారతి బరిలోకి దిగారు. మరోసారి గెలుస్తామనే ధీమా భాజపాలో కనిపిస్తోంది. రాంకృపాల్కు క్షేత్రస్థాయిలో మంచి పట్టు ఉంది. తమకు గతంలో అండగా నిలిచిన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది.
సాగు భూమైన అడవి
ఒకప్పుడు బక్సర్లో అత్యధిక అటవీ ప్రాంతం ఉండేది. దానిని సాగు భూమిగా మార్చడంతో అడవులు తగ్గిపోయాయి. ఇక్కడి అడవుల్లో మామిడి, నువ్వులు, వెదురు లభిస్తాయి. గతంలో ఇక్కడ దాదాపు అన్ని పార్టీలూ గెలిచాయి.
2014, 2019లలో భాజపా నేత అశ్వినీ కుమార్ చౌబే గెలిచారు. ప్రస్తుతం భాజపా తరఫున మిథిలేశ్ తివారీ, ఆర్జేడీ నుంచి సుధాకర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది.
ధాన్యాగారం
ధాన్యాగారంగా పేరు పొందిన సాసారాం పర్యాటక ప్రాంతం కూడా. ఎస్సీలకు రిజర్వు అయిన ఈ నియోజకవర్గం నుంచి బాబూ జగ్జీవన్ రామ్, ఆయన కుమార్తె మీరా కుమార్ ఎంపీలుగా గెలిచారు. 19,04,173 ఓట్లున్న సాసారాంలో ఎస్సీ వర్గాల వారిదే ఆధిపత్యం. చామర్, కుశ్వాహాలు అధికంగా ఉంటారు. ఆ తర్వాత వైశ్యుల జనాభా అధికం. ఇక్కడ రైతుల సమస్యలే ఎన్నికల ఎజెండా.
2014, 2019లతోపాటు మొత్తం నాలుగుసార్లు ఛేదీ ప్రసాద్ ఇక్కడి నుంచి భాజపా ఎంపీగా గెలిచారు. ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. భాజపా నుంచి శివేశ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా మనోజ్ కుమార్ తలపడుతున్నారు. దళితుల ఓట్లు ఎవరికి దక్కుతాయనే దానిని బట్టే ఇక్కడి ఫలితం ఆధారపడి ఉంది. ఒకప్పుడు ఇది కాంగ్రెస్కు కంచుకోట.
వ్యాపార కేంద్రం
భోజ్పుర్, ఔరంగాబాద్లకు రోడ్డు కనెక్టివిటీ ఉండటంతో కారాకాట్ వ్యాపార కేంద్రంగా ఎదిగింది. అయితే రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సౌకర్యాల లేమి, శాంతి భద్రతల సమస్య ఇక్కడి ఇక్కట్లు. కొయిరీ (కుశ్వాహా), రాజ్పూత్, యాదవ వర్గానికి చెందిన వారు రెండేసి లక్షల మంది ఉన్నారు.
2014లో ఆర్ఎల్ఎస్పీ నేత ఉపేంద్ర కుశ్వాహా, 2019లో జేడీయూ నేత మహాబలి సింగ్ గెలిచారు. ఈసారి ఇండియా కూటమిలోని సీపీఐ (ఎంఎల్-ఎల్) నుంచి రాజా రాంసింగ్, రాష్ట్రీయ లోక్ మోర్చా (గతంలో ఆర్ఎల్ఎస్పీ) తరఫున ఉపేంద్ర కుశ్వాహా పోటీ చేస్తున్నారు. భాజపా టికెట్ ఇవ్వకపోవడంతో భోజ్పురీ నటుడు పవన్సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రధాన అభ్యర్థులిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు. కుశ్వాహా వర్గానికి చెందిన రాజా రాంసింగ్ ముస్లిం, యాదవ్ ఓట్లపై ఆధారపడుతున్నారు. పవన్ సింగ్ రాజ్పూత్ వర్గానికి చెందినవారు. ఆయన భాజపా ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నీతీశ్ తదితర అగ్ర నేతలంతా కారాకాట్లో ప్రచారం చేస్తున్నారు.
నక్సల్స్ ప్రభావం
నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన జహానాబాద్.. శాంతి భద్రతల పరంగా అత్యంత సున్నితమైన నియోజకవర్గం. లెఫ్ట్ పార్టీలకు చాలా కాలంగా కంచుకోటగా నిలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, జనతాదళ్ గెలిచాయి. అప్పటి నుంచీ ఏ ఒక్కరూ రెండుసార్లు గెలవలేదు.
2014లో ఆర్ఎల్ఎస్పీ, 2019లో జేడీయూ గెలిచాయి. ఈసారి జేడీయూ తరఫున చందేశ్వర్ ప్రసాద్, ఆర్జేడీ నుంచి సురేంద్ర ప్రసాద్ బరిలో నిలిచారు. ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీలాల్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు లోక్ జన్ శక్తి నేత అరుణ్ కుమార్ ఎన్డీయేను వీడి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
గంగా పరీవాహక ప్రాంతం
గంగా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం ఆరా. ఆహార ధాన్యాల వ్యాపార కేంద్రం. భోజ్పుర్ జిల్లాలోకి వస్తుంది. వెనుకబడిన వర్గాలవారు, ముస్లింలు, యాదవులు, క్షత్రియులు ఇక్కడి ఫలితాన్ని శాసిస్తారు.
2014, 2019లలో భాజపా గెలిచింది. ప్రస్తుతం భాజపా తరఫున ఆర్కే సింగ్, ఇండియా కూటమిలోని సీపీఐ (ఎంఎల్-ఎల్) నుంచి సుధామ ప్రసాద్ బరిలో ఉన్నారు. మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఆర్కే సింగ్ తలపోస్తున్నారు. 2019 బిహార్ వరదల్లో అసామాన సేవలందించిన సుధామ ప్రసాద్ సామాన్యుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అదే తనను గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఏ కూటమిలో ఎవరు?
ఎన్డీయే
భాజపా, జేడీయూ, లోక్ జన్ శక్తి, హిందుస్థాన్ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా.
ఇండియా
ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్).
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.