Lok Sabha Elections: కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 20 May 2024 09:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. ఐదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తొలిగంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Lok Sabha Elections

  • కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన సిట్టింగ్ నియోజవర్గం అమేఠీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌ ఓటేశారు. ఆమె జేఎంఎం తరఫున గాండే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌, కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్‌, వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 
  • బాలీవుడ్‌ నటులు పరేశ్‌ రావల్‌, సాన్యా మల్హోత్రా, జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌రావ్‌, అక్షయ్ కుమార్‌, పర్హాన్‌ అక్తర్‌, జోయా అక్తర్‌, షాహిద్‌ కపూర్‌ తదితరులు ఉదయమే ఓటు హక్కు వినియోగించున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని