బెంగాల్లో దీదీ దూకుడు.. నవీన్ జోరుకు భాజపా బ్రేకులు.. తమిళనాడులో డీఎంకే హవా
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు దాటింది. అయితే.. ఆశించిన మేర స్థానాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు దాటినప్పటికీ.. గతంతో పోల్చితే మాత్రం సీట్లు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆశించిన దాని కంటే మెరుగైన ఫలితాలు సాధించి రెట్టింపు ఉత్సాహంలో ఉంది. పలు కీలక రాష్ట్రాల్లో ఫలితాల సరళిని పరిశీలిస్తే..
బెంగాల్లో దీదీ దూకుడు..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. అయితే.. ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దూకుడును భాజపా ఏమాత్రం అడ్డుకోలేక పోయింది. గత సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెరుగైన పనితీరు కనబరిచిన కమలదళం.. ఈసారి మరింత పోటీ ఇస్తుందని అంతా భావించారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృత పర్యటనలతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినప్పటికీ.. దీదీ చరిష్మాను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఇక్కడ దీదీ వర్సెస్ మోదీ అన్నట్లు హోరాహోరీ ప్రచారం జరిగినా.. చివరికి మమత వైపే ప్రజలు మొగ్గు చూపారు. క్రితం లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించిన భాజపా.. ఈసారి 12 సీట్లకే పరిమితమైంది. గత లోక్సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ.. ఈసారి మరింత బలపడి 29 స్థానాలతో సత్తా చాటుతోంది.
కుప్పకూలిన కంచుకోట..! నవీన్ రికార్డుకు భాజపా బ్రేకులు..
ఒడిశాలో అసెంబ్లీతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఇప్పటి వరకూ ఎదురే లేకుండా దూసుకెళ్లిన అధికార బిజూ జనతాదళ్(BJD) అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ జోరుకు భాజపా బ్రేకులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్థానాలకుగానూ కమలదళం 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ‘74’ను ఇప్పటికే దాటేసింది. బిజద కేవలం 48 స్థానాలకే పరిమితమైంది. 14 చోట్ల కాంగ్రెస్, ఒకచోట సీపీఎం, మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే.. బిజద ఈసారి ఏకంగా 65 చోట్ల చతికిలపడటం గమనార్హం. ఆయన క్యాబినెట్లోని ఎనిమిది మంత్రులు ఓటమి బాటపట్టారు. మరోవైపు.. రాష్ట్రంలోని 21 లోక్సభ స్థానాల్లోనూ కాషాయ పార్టీ 19 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బిజద ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తమిళనాడులో డీఎంకే హవా..
తమిళనాడులో డీఎంకే స్పష్టమైన హవా కనిపించింది. ఇక్కడ ఇండియా కూటమి దాదాపు క్లీన్స్వీప్ చేసింది. స్టాలిన్ నాయకత్వానికే ఇక్కడి ప్రజలు ఓటు వేశారు. మొత్తం 39 స్థానాలు ఉండగా.. కూటమి అభ్యర్థులు 38 స్థానాలతో దూసుకెళ్తున్నారు. వీటిలో కాంగ్రెస్వి 9 స్థానాలు ఉన్నాయి. ఇక ఇక్కడ అన్నాడీఎంకే, భాజపా ఖాతానే తెరవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
చతికిలపడ్డ ఆప్..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ పెద్దగా ప్రభావం చూపించలేదు. గత లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఒక్క సీటుకే పరిమితమైన ఆప్.. ఈ సారి 3 సీట్లలో గెలుపొందింది. ఇక్కడ కాంగ్రెస్ 7 స్థానాలతో ముందుంది. ఇక దిల్లీలో మొత్తం 7 చోట్ల భాజపా అభ్యర్థులే గెలుపొందారు. ఇక్కడ ఇండియా కూటమి ప్రభావం ఏ మాత్రం లేదు.
కేరళ కాంగ్రెస్దే..
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ దూసుకెళ్లింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భాజపా ఇక్కడ తొలిసారి ఖాతా తెరిచింది. ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సురేశ్ గోపీ 74 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?