MLA Pinnelli: పోలింగ్ బూత్లో పిన్నెల్లి విధ్వంసకాండ
అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. తానో శాసనసభ్యుడినని మర్చిపోయి వీధిరౌడీలా, గూండాలా ప్రవర్తించారు.
ఎన్నికల రోజు పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను నేలకేసి కొట్టి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే
వెబ్కెమెరాల్లో రికార్డయిన ఘటన
గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టిన పోలీసులు
వీడియో బహిర్గతమవడంతో తప్పనిసరై ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చిన వైనం
ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ
ఈనాడు - అమరావతి
అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. తానో శాసనసభ్యుడినని మర్చిపోయి వీధిరౌడీలా, గూండాలా ప్రవర్తించారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ దురాగతానికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణకాష్ఠంలా, బందిపోట్లకు నిలయమైన ఒకప్పటి చంబల్లోయలా మార్చేసిన పిన్నెల్లి.. అక్కడ ఎంత పేట్రేగిపోతున్నారో చెప్పేందుకు ఆ వీడియోనే నిదర్శనం. పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది! మాచర్లకు నాలుగోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లి... తాలిబాన్ల లాంటి తన అనుచరగణంతో ప్రజల్ని
భీతావహుల్ని చేస్తూ నియోజకవర్గాన్ని మరో అఫ్గానిస్థాన్లా మార్చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ, ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్ చేయించుకుని గెలుస్తున్న ఆయనకు ఈసారి తెదేపా నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు తెదేపాకు గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని బూత్లోకి దూసుకెళ్లారు. శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఈవీఎంను రెండు చేతులతో ఎత్తి, నేలకేసి బలంగా కొట్టారు. ఈవీఎంతోపాటు, వీవీప్యాట్ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి. వాటిని తన్నుకుంటూ తెదేపా ఏజెంట్కు వేలు చూపించి బెదిరిస్తూ ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని
పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
భీతావహులైన సిబ్బంది
ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా అనుచరుల్ని వెంటేసుకుని పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళుతున్నా పోలీసులు, పోలింగ్ సిబ్బంది అడ్డుకోలేదు. ఆయన పోలింగ్ బూత్లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు. ఆయన నేరుగా పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారు. తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యేపైకి కూడా విసురుగా వెళుతుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు. ఈ ఘటనతో పోలింగ్ సిబ్బందితోపాటు, ఓటర్లు భీతావహులయ్యారు. ఎమ్మెల్యే ఈవీఎంను విసిరికొడుతున్న సమయానికి... ఎదురుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కంపార్ట్మెంట్లో ఓటు వేస్తున్న వ్యక్తి భయంతో బయటకు పారిపోవడం, మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వచ్చాక ఆయన అనుచరులు, వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. తెదేపా కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నంబూరి శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. శేషగిరిరావు సహా తెదేపాలో కీలకంగా వ్యవహరించిన కొందరు.. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అరాచకాలకు భయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో కాలం గడుపుతున్నారు.
కిందపడిన వీవీప్యాట్ను పైకి తీసి మళ్లీ నేలకేసి కొడుతున్న పిన్నెల్లి
నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడినే గుర్తుపట్టలేనంత భయం!
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగా.. ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ ఘటనపై పోలీసులు ఏమని కేసు నమోదు చేశారో తెలుసా? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారట! పోలింగ్ సిబ్బంది కూడా వారిని గుర్తుపట్టలేకపోయారట! ఎమ్మెల్యే పోలింగ్ స్టేషన్లోకి రాగానే సిబ్బంది గౌరవసూచకంగా లేచి నమస్కరించడం సీసీ కెమెరాలో చక్కగా రికార్డయింది. కానీ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లిని పోలింగ్ సిబ్బంది ఎవరూ గుర్తుపట్టలేదట. దీన్నిబట్టే వారెంత భయపడ్డారో అర్థమవుతోంది. సిబ్బంది గుర్తుపట్టకపోయినా సీసీ కెమెరాలున్నాయి కదా! ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేయడం, తెదేపా ఏజెంట్ను బెదిరించడం వంటివన్నీ పోలింగ్ సిబ్బందిలో ఒకరు సెల్ఫోన్లో వీడియో తీయడం కూడా సీసీ కెమెరాలో రికార్డయింది. దాని ఆధారంగానైనా ఆయనపై కేసు పెట్టొచ్చు కదా! కానీ పెట్టలేదు. ఎందుకంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులంతా ఎమ్మెల్యే బంటులే!
ధ్వంసమైన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు.. వీడియో తీస్తున్న అధికారి
అంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో ఇద్దరే పోలీసులు
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో రెండు బూత్లు ఉన్నాయి. 1,464 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇదీ ఒకటి. కానీ పోలింగ్ రోజున అక్కడున్నది కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు. ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొట్టినా, తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ అరాచకం సృష్టించినా చోద్యం చూడటం తప్ప ఆ కానిస్టేబుళ్లు చేసిందీ, చేయగలిగిందీ ఏమీ లేదు. పల్నాడులో ఎన్నికల సంఘం పోలింగ్ ‘ఎంత చక్కగా’ నిర్వహించిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, 34 కంపెనీల బలగాలు కావాలని జిల్లా అధికారులు కోరితే 19 కంపెనీల్ని మాత్రమే ఇచ్చి సర్దుకోమన్నారు. పోలింగ్ రోజున ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డూఆపూ లేకుండా పోవడానికి అదీ ఒక కారణం.
పిన్నెల్లి చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావు
అప్పటి డీజీపీ నుంచి క్షేత్రస్థాయి పోలీసుల వరకు అందరూ బాధ్యులే!
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఎన్నికల్లో చేయని అరాచకం లేదు. పోలింగ్ రోజున, అనంతరం తీవ్రస్థాయిలో హింసాకాండకు పాల్పడ్డారు. కారంపూడిలో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేసి, దొరికినవాళ్లను దొరికినట్టు కొట్టి, తీవ్ర భయోత్పాతం సృష్టించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరింతగా పేట్రేగిపోయారు. అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మొదలు.. అప్పటి పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, చివరకు హోంగార్డుల వరకు ఆయనకు అడ్డగోలుగా కొమ్ముకాశారు. ఒక అరాచక శక్తిని పెంచి పోషించారు. రాజేంద్రనాథరెడ్డి, రవిశంకర్రెడ్డిలను ఈసీ బదిలీ చేసినా.. డీఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకూ అందరూ పిన్నెల్లి కోరి తెచ్చుకున్నవారే ఉండటంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల్ని ఆయన కింద పనిచేసే అధికారులెవరూ పాటించలేదు సరికదా, ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు చేరవేసేవారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకానికి చివరకు ఎస్పీ బిందుమాధవ్ కూడా బలయ్యారు.
పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళుతూ నంబూరి శేషగిరిరావును హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
అరెస్ట్ భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ!
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రభుత్వ విప్గా కేబినెట్ హోదా కలిగిన పదవిలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు బయటపడుతుండటంతో అరెస్ట్ తప్పదన్న భయంతో ఇటీవల పరారయ్యారు. పల్నాడులో హింసాకాండపై హైకోర్టు చీవాట్లు పెట్టడం, ఎస్పీ సహా ఏడుగురు పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడం, కలెక్టర్ను బదిలీ చేయడంతో ఇక తమ ఆటలు సాగవని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది. అల్లర్లపై దర్యాప్తునకు సిట్ను నియమించడంతో పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పారిపోయి తలదాచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే తన గన్మెన్లను వదిలేసి పారిపోయారు.
కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నంబూరి
వీడియో బయటకు రాకపోతే అందరూ శుద్ధపూసలే
మాచర్లలో ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరులు అన్ని అరాచకాలు చేసినా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అక్కడికి వెళ్లలేదు. ఏం జరిగిందో తెలుసుకోలేదు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే చేసిన విధ్వంసం, ఈవీఎంను పగలగొట్టడం వెబ్క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు నేరుగా చూడొచ్చు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కూడా ఉన్నాయి. పోలింగ్ సిబ్బంది సెల్ఫోన్లోనూ రికార్డు చేశారు. కానీ మంగళవారం వీడియో వెలుగులోకి వచ్చే వరకు ఈసీకి ఆ విషయం తెలియలేదంటే, కేసు నమోదు చేయలేదంటే.. ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, పాత, కొత్త ఎస్పీలు సహా అక్కడి పోలీసులు ఎంత చక్కగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది. వీడియో వెలుగులోకి వచ్చాక ఎన్నికల సంఘం హడావుడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు! ఆ వీడియో బయటకు రాకపోతే.. ఎన్నికల సంఘం, పోలీసులు, పోలింగ్ సిబ్బంది అందరూ శుద్ధపూసలే! ఇంతకాలం పోలీసులు పల్నాడులో ఎంత ఏకపక్షంగా పనిచేశారో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ! పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పరారయ్యేందుకు పోలీసులే సహకరించారని చెప్పడానికి సందేహమే అక్కర్లేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడ బాహాటంగా తిరుగుతూ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలూ ఇస్తున్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి.
పోలింగ్ అనంతరం అదేరోజు వైకాపా శ్రేణులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ నంబూరి
ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలి
పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ డిమాండు చేశారు. ఇంత అరాచకం చేశారని తెలిసినా పోలీసు యంత్రాంగం నిందితుణ్ని అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అల్లర్లపై వేసిన సిట్ ఒక డొల్ల అని విమర్శించారు.
కఠిన చర్యలకు డీజీపీని ఆదేశించండి: ఈసీ
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించింది.
నేను అమాయకుడినే..
ఎక్కడా గొడవలు చేయలేదన్న ఎమ్మెల్యే పిన్నెల్లి
రాత్రికి వీడియో ద్వారా బట్టబయలైన నిజస్వరూపం
ఈనాడు, అమరావతి: ‘నేనెక్కడా గొడవలు చేయలేదు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు’... పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈ నెల 13న ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఒక మీడియా ఛానెల్తో చెప్పిన మాటలివి. ‘నేనెక్కడికీ పారిపోలేదు. పారిపోవాల్సిన అవసరం లేదు. నాపై ఏమైనా కేసులున్నాయా? నేనేమైనా గొడవలు చేయించానా? గొడవలు చేయించింది మీరే. మాచర్ల రావాలంటే రెండు గంటలు..’ అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని తీవ్ర పదజాలంతో పిన్నెల్లి దూషించారు. బిందుమాధవ్ పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన నాటి నుంచే తమకు అనుమానంగా ఉందని ఆరోపణలు చేశారు. కానీ ఈవీఎం పగలగొడుతూ ఆయనే అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఎంత అమాయకుడో.. కొద్ది గంటల్లోనే అందరికీ తెలిసిపోయింది. సాయంత్రం 4 గంటలకు ఆయన మీడియా ఛానెల్తో పైన చెప్పిన విషయాలు మాట్లాడగా.. రాత్రి 9 గంటలకు ఈవీఎం ధ్వంసం వీడియో బయటకొచ్చింది. గొడవలు చేయలేదని ఆయన చెప్పిన మాటలు.. శుద్ధ అబద్ధమని తెలిసిపోయింది.
మా పిన్నెల్లి మంచివాడంటూ కితాబిచ్చారే..!
జగన్.. ఇప్పుడేమంటారో?
‘మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. రామకృష్ణారెడ్డిని అఖండమైన మెజారిటితో గెలిపించండి. ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను’ అని ఈ నెల 6న మాచర్లలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ‘ఎంతో మంచివాడంటే.. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి అక్కడి వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, ఈవీఎంలు ధ్వంసం చేసేవారా?’ అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. ‘రామకృష్ణారెడ్డి మీకు మరింత స్నేహితుడు అంటున్నారు. అలాంటి వ్యక్తులే మీ స్నేహితులా? ఈవీఎం పగలగొట్టిన ఆయనపై చర్యలు తీసుకుంటారా? లేదా మరింత పైస్థానం కల్పిస్తానంటూ వెనకేసుకొస్తారా’’ అని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..