Julakanti Brahma Reddy: జవహర్రెడ్డి కనుసన్నల్లో జరిగే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు
పోలీసుల కనుసన్నల్లోనే పల్నాడులో హింస జరిగిందని.. తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసి, ఆస్తుల్ని ధ్వంసం చేశారని నరసరావుపేట ఎంపీ, లోక్సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు.
వాస్తవాలు బయటకు రావాలంటే.. సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలి
పల్నాడులో హింసాకాండకు కారణం వైకాపా అనుకూల పోలీసులే
పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి కారణం
తెదేపా నేతలు శ్రీకృష్ణదేవరాయలు, బ్రహ్మారెడ్డి ధ్వజం
మాచర్ల నుంచి పారిపోయి టీవీ ఛానల్తో మాట్లాడుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు
అరెస్టు చేయలేదని వీడియో క్లిప్ చూపి ప్రశ్నిస్తున్న జూలకంటి బ్రహ్మారెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు
ఈనాడు- అమరావతి, న్యూస్టుడే- పట్టాభిపురం (గుంటూరు): పోలీసుల కనుసన్నల్లోనే పల్నాడులో హింస జరిగిందని.. తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసి, ఆస్తుల్ని ధ్వంసం చేశారని నరసరావుపేట ఎంపీ, లోక్సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కాకుండా.. వైకాపాకు చీఫ్ సెక్రటరీలా వ్యవహరిస్తున్న కేఎస్ జవహర్రెడ్డి కనుసన్నల్లో జరిగే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. వాస్తవాలు బయటకు రావాలంటే సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండు చేశారు. ఎన్నికల తర్వాత తెదేపా వారిపై దాడి చేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పదేపదే చేసిన హెచ్చరికలపై ఎన్నికల సంఘం, జాతీయ మానవహక్కుల కమిషన్కు ముందే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినా.. ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎస్ నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు వైకాపాకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి, మౌనంగా ఉండిపోయింది. అక్కడ ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇది ముమ్మాటికీ వారి వైఫల్యమే’ అని విరుచుకుపడ్డారు.
మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలపై శ్రీకృష్ణదేవరాయలు, బ్రహ్మారెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ‘పోలింగ్ రోజు, తర్వాత మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డే ప్రధాన కారణం. దాడుల్ని కట్టడి చేయటంలో పోలీసు శాఖ, ఎన్నికల కమిషన్ విఫలమయ్యాయి. ఎన్నికల తర్వాత దాడులు జరుగుతాయని మేం ముందే అప్రమత్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాడుల తర్వాత.. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడ వైకాపాకు చెందిన మీడియా సంస్థలతో మాట్లాడారు. అయినా పోలీసులు ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని పేర్కొన్నారు. ‘ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారో ఎమ్మెల్యే పిన్నెల్లి చెప్పాలి. ఆయన ఇంట్లో రాళ్లు, ఆయుధాలు ఎందుకు ఉన్నాయి?’ అని ప్రశ్నించారు. అధికారులు ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి రాళ్లు తరలిస్తున్న ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు.
వాహనాలతో తొక్కిస్తే.. హత్యాయత్నం కాదా?
‘ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టి నన్ను గృహనిర్బంధం చేశారు. చట్టాన్ని గౌరవించి నేను ఇంట్లోనే ఉన్నా.. పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితోపాటు ఆయన అనుచరులు వెళ్లి దాడులు చేసింది నిజం కాదా?’ అని బ్రహ్మారెడ్డి నిలదీశారు. ‘పిన్నెల్లి అనుచరులు మాచర్లలో తెదేపా వాళ్లను వాహనాలతో తొక్కిస్తే హత్యాయత్నం కేసులు కాకుండా 324 సెక్షన్ పెట్టి కేసు నమోదు చేశారు. మైనార్టీలపైనా వారు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడ్డారు. వైకాపా దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాయపడ్డారు’ అని చెప్పారు.
ఐజీ, ఎస్పీ ఉన్నప్పుడే.. కారం చల్లి దాడి
ఐజీ శ్రీకాంత్, ఎస్పీ సుప్రజ అక్కడ ఉన్నప్పుడే.. రెంటాలలో తనపై కారం చల్లి దాడి చేశారని బ్రహ్మారెడ్డి చెప్పారు. ‘కారంపూడిలో ఒక సామాజికవర్గానికి చెందిన అధికారిపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాడి చేశారు. అయినా ఆయన ఎమ్మెల్యే సరిహద్దు దాటే వరకు భద్రత కల్పించారు. పిన్నెల్లి మాత్రం పోలీసులు తెదేపాకు అనుకూలమని ప్రచారం చేస్తున్నారు. పోలీసు అధికారుల నియామకాలన్నీ.. ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారమే చేశారు. కానీ పోలీసు అధికారులకు కులం అంటగట్టి మాట్లాడుతున్నారు. ఆ జాబితా పంపింది వైకాపా ప్రభుత్వంలోని చీఫ్ సెక్రటరీ కాదా? ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు రావటం అధికార దుర్వినియోగం కాదా? మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్ పుట్టినరోజు వేడుకలకు కొందరు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఇవన్నీ చూస్తే మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు.. అధికార పార్టీ నేతలతో ఎంతగా అంటకాగారో అర్థమవుతుంది’ అని బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు రేంజి ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఎన్నికల సంఘం నియమిస్తే.. దానికీ తెదేపా కారణమంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు.
అదనపు బలగాలు కోరినా ఇవ్వలేదు
- శ్రీకృష్ణదేవరాయలు
150 పోలింగ్ కేంద్రాల పరిధిలో గొడవలు జరుగుతాయని ముందే చెప్పామని, అదనపు బలగాలను మోహరించాలని తాము కోరినా పట్టించుకోలేదని లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. పోలింగ్ రోజు, తర్వాత మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాకాండకు పోలీసులే కారణమని మండిపడ్డారు. దాడులు జరుగుతున్నాయని చెప్పినా వారు స్పందించలేదని, సిట్ అధికారులు దీనిపై విచారణ చేయాలని ఆయన డిమాండు చేశారు. ‘ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి తెదేపాకు ఓటేస్తున్నారని తెలిసే.. పోలింగ్ శాతం ఎలాగైనా తగ్గించాలని వైకాపా నేతలు ప్రయత్నించారు. పోలింగ్ రోజు ఉద్దేశపూర్వకంగా తెదేపా ప్రభావిత గ్రామాల్లో అధిక సంఖ్యలో పోలీసుల్ని పెట్టి.. కార్యకర్తలను ఓటేయడానికి రాకుండా అడ్డుకున్నారు. అక్కడ బూత్కు ఒక్క కానిస్టేబుల్ను మాత్రమే పెట్టడంతో.. ఆయన దౌర్జన్యాలను నిలువరించలేకపోయారు. వైకాపా ప్రభావిత గ్రామాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఇష్టారాజ్యంగా వదిలేశారు. దాడులు జరుగుతున్నాయని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. వారు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో వివరాలు తీయాలి. పోలింగ్ ముందు, తర్వాత మా కదలికలపైనా విచారణకు మేం సిద్ధమే. అవసరమైతే ఫోను కూడా ఇస్తాం’ అని పేర్కొన్నారు. ఇంత దౌర్జన్యాలకు దిగినా 85% పైగా పోలింగ్ జరగడాన్ని వైకాపా నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు’ అని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే