Magunta: వైకాపాకు మరో షాక్.. ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
వైకాపాకు మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీని వీడారు.
ఒంగోలు: వైకాపాకు మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.. ఉన్నదల్లా ఆత్మగౌరవమే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైకాపాను వీడుతున్నాం. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం’’ అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
మాగుంట రాజీనామాతో కొద్దిరోజుల్లోనే ఆరుగురు ఎంపీలు వైకాపాను వీడినట్లయింది. వీరిలో ఐదుగురు లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, సంజీవ్కుమార్ (కర్నూలు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), రఘురామకృష్ణరాజు (నర్సాపురం)తో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
స్థానిక ఎన్నికల సాకుతో హామీల దాటవేతకు సర్కారు యత్నం: బండి సంజయ్
స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో మరోమారు హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
కిషన్రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితం: కోదండరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. -
కవితను కలిసిన భారాస నేతలు
దిల్లీ మద్యం కేసు వ్యవహారంలో ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను భారాస నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బాల్క సుమన్ కలిశారు. -
45 రోజులుగా కల్లాల్లోనే ధాన్యం
విలేకరులతో మాట్లాడుతున్న మహేశ్వర్రెడ్డి చిత్రంలో ఎమ్మెల్యేలు రామారావు పటేల్, రాకేశ్రెడ్డి, పాల్వాయి హరీశ్కుమార్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని గత 45 రోజులుగా వారు ధాన్యాన్ని కల్లాల్లో పోసుకుని ఎదురుచూస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని భాజపా శాసనసభాపక్ష నేత ఎ. మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దే!
-
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
రాహుల్ గాంధీకి మద్దతుగా సోనియాగాంధీ రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే పలువురు కీలక నేతల్ని జైలుకు పంపుతుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు