Maharashtra: మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు కొలిక్కి.. కాంగ్రెస్కు 18 స్థానాలు..!
Maharashtra: కాంగ్రెస్, యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీ మధ్య సీట్ల పంపిణీ పూర్తయిందని, కొద్ది గంటల్లో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్ర(Maharashtra)లో ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీ(MVA)లో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. మొత్తం 48 లోక్సభ స్థానాలకుగానూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(UBT) 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 18, శరద్పవార్ ఎన్సీపీ 10 చోట్ల అభ్యర్థులను బరిలో దించనుందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై అధికారికంగా కొద్ది గంటల్లో ప్రకటన వెలువడనుంది.
ఈ మూడు ప్రధాన విపక్ష పార్టీల మధ్య సీట్ల పంపిణీపై కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. 8 సీట్ల విషయంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు తొలగిపోయిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ముంబయిలోని ఆరు లోక్సభ స్థానాల్లో నాలుగు చోట్ల శివసేన(యూబీటీ) పోటీ పడనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎంవీఏ మిత్రపక్షమైన వంచిత్ బహుజన్ అఘాడీ రెండు స్థానాల్లో బరిలో నిలవనుంది. ఆ సీట్లు ఠాక్రే పార్టీ వాటా నుంచి వెళ్లనున్నాయి. పవార్ పార్టీ తనకు దక్కిన 10 స్థానాల్లో ఒకదాన్ని స్వతంత్ర అభ్యర్థితో పంచుకోనుందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం