Uttam Kumar Reddy: కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి గుర్తింపు: మంత్రి ఉత్తమ్‌

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్‌, బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 18 Jan 2024 13:31 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్‌, బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని చెప్పారు. అందుకు మహేశ్‌గౌడ్‌, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. సర్పంచ్‌ల బిల్లులు ఆపిందే గత భారాస ప్రభుత్వమని.. ఇప్పుడు వారి తరఫున పోరాడుతామని కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని