Manikya Rao: పిన్నెల్లి సోదరుల నుంచి నా ప్రాణాలకు ముప్పు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెదేపా కార్యకర్త, పోలింగ్ రోజు కండ్లకుంటలో ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేశారు.
తెదేపా ఏజెంటుగా కూర్చున్నానని నా భార్య, బిడ్డల్ని చంపాలని చూశారు
కాపాడాలని డీజీపీని వేడుకున్న మాణిక్యరావు
కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీకి ఆదేశం
డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు వినతిపత్రం ఇస్తున్న మాణిక్యరావు, వర్ల రామయ్య, గూడపాటి లక్ష్మీనారాయణ, మన్నవ సుబ్బారావు, అఖిల్ తదితరులు
ఈనాడు డిజిటల్, అమరావతి, న్యూస్టుడే, మంగళగిరి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెదేపా కార్యకర్త, పోలింగ్ రోజు కండ్లకుంటలో ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపడానికి కండ్లకుంటకు చెందిన బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, మోదుగుల వెంకటరెడ్డిని వారు నియమించారని వాపోయారు. ప్రస్తుత పరిస్థితిలో తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ మేరకు డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, గూడపాటి లక్ష్మీనారాయణ, కోడూరి అఖిల్, వల్లూరి కిరణ్ తదితరులతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెనకాడుతున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా.. గుంటూరు ఎస్పీకి చెబుతానని మళ్లీ ఫిర్యాదు చేయాల్సిందిగా డీజీపీ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్పీ నుంచి సీఐ వరకు దీని గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదని.. చివరికి మీ దగ్గరకు రావాల్సి వచ్చిందని డీజీపీ ఎదుట తెదేపా నేతలు వాపోయారు. వెల్దుర్తి మండలం కండ్లకుంటలో పోలింగ్ రోజున పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సృష్టించిన అరాచకం, మాణిక్యరావు భార్య, కుమారులపై దాడి చేయడం, దాన్ని వీడియో తీసి అతడ్ని బెదిరించడం, నిందితులపై చర్యలు తీసుకోకుండా మిన్నకున్న పోలీసుల తీరును వారు డీజీపీకి వివరించారు. సానుకూలంగా స్పందించిన డీజీపీ బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.
ఏజెంటుగా కూర్చోకూడదా?
‘మాదిగ సామాజికవర్గానికి చెందిన నేను పోలింగ్ ఏజెంటుగా కూర్చోవడం పాపమా? ఎస్సీలు రాష్ట్రంలో ఉండకూడదా? వారిపై కిరాతకంగా దాడులు చేస్తుంటే పట్టించుకోరా?’ అని మాణిక్యరావు ప్రశ్నించారు. ‘‘పోలింగ్ కేంద్రంలోనే నన్ను కొట్టారు. తెదేపా ఏజెంటుగా కూర్చునే ధైర్యం నీకెక్కడిదిరా అంటూ నా కులాన్ని ప్రస్తావిస్తూ దూషించారు. వెంకట్రామిరెడ్డి సుమారు 300 మంది అనుచరులతో కలిసి నా ఇంటి మీదకు వెళ్లారు. నా పెద్ద కుమారుడిని కింద పడేసి పొత్తికడుపు మీద తన్నారు. నా చిన్నకుమారుడు, భార్యను కర్రలతో కొట్టారు. కాళ్లు పట్టుకుని బతిమాలినా వదల్లేదు. ఆ దృశ్యాల్ని మొబైల్లో రికార్డు చేసి... బూత్ లోంచి బయటకు వస్తావా లేదా.. అంటూ నన్ను బెదిరించి మానసిక వేదనకు గురిచేశారు’’ అని మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ మాణిక్యరావు తెలిపారు.
పిన్నెల్లి కంటే కిమ్ మేలు: వర్ల రామయ్య
రామకృష్ణారెడ్డి కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మేలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దళితుడైన మాణిక్యరావు, ఆయన కుటుంబంపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారు. నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ అంటూనే జగన్రెడ్డి, ఆయన అనుచరులు వారిపై దాడులకు తెగబడుతున్నారు’’ అని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్