MLC Bypoll: గత ఎన్నికల కంటే పెరిగిన చెల్లని ఓట్లు
ఓటర్లంతా పట్టభద్రులయినా, కొన్నాళ్ల నుంచి అధికారులు, పార్టీల నాయకులు ఓటింగ్ విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో చెల్లని ఓట్లు 2021 ఎన్నికల కంటే పెరిగాయి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తొలిసారి కాంగ్రెస్ విజయం
విజయబావుటా ఎగరేసిన తీన్మార్ మల్లన్న
ద్వితీయ ప్రాధాన్య ఓట్లపై ఆశలు పెట్టుకున్న రాకేశ్రెడ్డికి నిరాశ
చాలా మంది ఓటర్లు తొలి ప్రాధాన్య ఓటుకే పరిమితం
ఈనాడు, నల్గొండ: ఓటర్లంతా పట్టభద్రులయినా, కొన్నాళ్ల నుంచి అధికారులు, పార్టీల నాయకులు ఓటింగ్ విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో చెల్లని ఓట్లు 2021 ఎన్నికల కంటే పెరిగాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో 21,636 ఓట్లు చెల్లనివిగా నమోదు కాగా.. తాజా ఎన్నికల్లో ఈ సంఖ్య 27,990కి పెరిగింది. అంటే పోలైన ఓట్లలో సుమారు ఎనిమిది శాతం. మరో వైపు భాజపా అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్ అనంతరం తీన్మార్ మల్లన్నకు 1,50,524 ఓట్లు, భారాస మద్దతిచ్చిన ఏనుగుల రాకేశ్రెడ్డికి 1,35,802 ఓట్లు వచ్చాయి. అప్పటికీ గెలుపు కోటా అయినా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. అయితే సాంకేతికంగా పోటీలో ఇద్దరే మిగలడం, అప్పటికే తీన్మార్ మల్లన్న, రాకేశ్రెడ్డి కంటే 14,722 ఓట్ల ఆధిక్యంతో ఉండటంతో ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం మల్లన్నను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మల్లన్న గెలిచినట్లు ప్రకటించారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మాత్రం తుది దశలో పల్లా రాజేశ్వర్రెడ్డి, తీన్మార్ మల్లన్న పోటీలో మిగలగా... ఇద్దరు అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన పల్లా రాజేశ్వర్రెడ్డిని విజేతగా ప్రకటించడంతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియలో మల్లన్న ఓట్లను సైతం లెక్కించి అందులోని రెండో ప్రాధాన్య ఓట్లను పల్లా రాజేశ్వర్రెడ్డికి కలిపారు. దీంతో ఆయన అప్పట్లో గెలుపు కోటా సాధించారు. గతంలో కంటే అత్యధికంగా ఈ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ఓటర్లు కేవలం తొలి ప్రాధాన్య ఓటు మాత్రమే వేశారు. ఉదాహరణకు భాజపా అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచిన పాలకూరి అశోక్గౌడ్కు సంబంధించి చెరో 10 వేల ఓట్లకు పైగా బ్యాలెట్ పత్రాల్లో కేవలం ఒకటి (1) అంకే వేశారు. దీంతో భారాస అభ్యర్థి గెలుపు అవకాశాలు ఇక్కడే దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఉంది. తొలి ప్రాధాన్య ఓట్లలో మల్లన్నకు మెజారిటీ వచ్చినా... భాజపా, స్వతంత్ర అభ్యర్థుల బ్యాలెట్ పత్రాల్లోని రెండో ప్రాధాన్య ఓట్లతో గట్టెక్కుతామన్న భారాస నేతల ఆశలకు గండిపడింది.
తొలిసారి కాంగ్రెస్ పాగా...
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో భారాస బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించగా తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో భారాస సిటింగ్ సీటును కోల్పోయినట్లైంది. భారాస కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్ మద్దతిచ్చిన చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించడంతో సీఎం రేవంత్రెడ్డి ఆయన్ను అభినందించారు.
ప్రభావం చూపిన అశోక్గౌడ్
ప్రధాన పార్టీలతో సమానంగా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్గౌడ్ ఓటర్లపై ప్రభావం చూపారు. మొదటి ప్రాధాన్యంతో పాటు ఎలిమినేషన్ రౌండ్లు కలుపుకొని ఆయన 30,461 ఓట్లు సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ‘అశోక్ సార్’గా ప్రసిద్ధుడైన ఆయన గతంలో పలు పత్రికల్లో జర్నలిస్టుగా పని చేశారు. అనంతరం ఆన్లైన్లో పోటీ పరీక్షల క్లాసులు నిర్వహించారు. ఆ క్రమంలోనే రూ.1, రూ.100లకు క్లాసులను సబ్స్క్రైబ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులు ఆయన యూట్యూబ్ ఛానెల్ను అనుసరించారు. ఓట్ల పరంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థుల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు