Komatireddy: కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ శిందేలు లేరు.. పదేళ్లు రేవంతే సీఎం: మంత్రి కోమటిరెడ్డి

మతాలు, కులాల మధ్య భాజపా చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) విమర్శించారు.

Updated : 11 Apr 2024 13:13 IST

హైదరాబాద్‌: మతాలు, కులాల మధ్య భాజపా చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ శిందేలు ఎవరూ లేరని.. ఆయన్ను సృష్టించిందే భాజపా అని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్‌ నాయకత్వంలో పని చేస్తున్నట్లు తెలిపారు. 

భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు, భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధమేనన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని