Ponnam Prabhakar: కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు భాజపా, భారాస కుట్ర: మంత్రి పొన్నం

భాజపాకి తెలంగాణలో ఓటు అడిగే హక్కులేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 12 Apr 2024 14:50 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో భాజపాకి ఓటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఒక్క జాతీయ ప్రాజెక్టు అ యినా ఇచ్చిందా అని నిలదీశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపాను వ్యతిరేకిస్తే.. ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చేనేతలకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని విమర్శించారు. భాజపా, భారాస కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు