సాంకేతిక అవగాహన లేకున్నా.. భారాస నేతలు మాట్లాడడం దురదృష్టకరం: ఉత్తమ్
మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల పరిశీలనకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ నెల 6న రాష్ట్రానికి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సహా అన్నారం, సుందిళ్ల పరిశీలనకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ నెల 6న రాష్ట్రానికి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. సుందిళ్ల, అన్నారం ఆనకట్టల్లోనూ మేడిగడ్డలో ఉన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా ఖాళీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకే నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో భారాస రాజకీయాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఆ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా.. మాట్లాడడం దురదృష్టకరమని ఆక్షేపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాల్లో నిబంధనలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. రూ.94 వేల కోట్ల వ్యయం చేసిన ప్రాజెక్టులో.. మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిదన్నారు. భారాస నాయకుల మాటలకు విలువ లేదని, ఆనకట్ట కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సింది పోయి ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడానికి 4 నెలల గడువు ఉన్నప్పటికీ... సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?