YSRCP: కళ్లు నెత్తికెక్కిన మంత్రులను చాచి కొట్టిన ఓటర్లు
పదవి దక్కినప్పటి నుంచి విర్రవీగుతూ.. ఇష్టానుసారం వ్యవహరించి.. దౌర్జన్యాలు, దందాలు చేసి.. నోటి దురుసుతో విరుచుకుపడి.. కళ్లు నెత్తికెక్కిన.. మంత్రులు అందరికీ ఓటర్లు బుద్ధి చెప్పారు.
ఈనాడు-అమరావతి: పదవి దక్కినప్పటి నుంచి విర్రవీగుతూ.. ఇష్టానుసారం వ్యవహరించి.. దౌర్జన్యాలు, దందాలు చేసి.. నోటి దురుసుతో విరుచుకుపడి.. కళ్లు నెత్తికెక్కిన.. మంత్రులు అందరికీ ఓటర్లు బుద్ధి చెప్పారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారందరినీ చాచి కొట్టినట్లు ఓడించారు. తొలివిడత మూడేళ్లూ, తర్వాత రెండేళ్లూ మంత్రులుగా కొనసాగిన వారెవరికి విజయం దక్కలేదు. అయిదు సామాజిక వర్గాలకు చెందిన వారికి.. అయిదు ఉప ముఖ్యమంత్రుల పదవులంటూ ఆయా వర్గాల ఓట్లను పట్టేయచ్చని జగన్ వేసిన ప్రణాళికను ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. తరతమ బేధం లేకుండా ఉపముఖ్యమంత్రులందరినీ ఓడించారు. ప్రస్తుత సిట్టింగ్ మంత్రులే కాకుండా, తొలి విడతలో మూడేళ్లు మంత్రులుగా పనిచేసిన వారిలో కూడా ఏ ఒక్కరూ గెలవలేదు. మొన్నటి వరకు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం మాత్రం ఎన్నికలకు ముందు తెదేపాలో చేరి, గుంతకల్లు నుంచి పోటీచేసి విజయం సాధించారు.
ఉప ముఖ్యమంత్రులంతా ఔట్
ప్రస్తుత సిట్టింగ్ ఉప ముఖ్యమంత్రులైన కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), అంజాద్ బాషా (కడప), పీడిక రాజన్నదొర (సాలూరు) ఓటమి చవిచూశారు. అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఓడిపోయారు. ఇప్పటివరకు సిట్టింగ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ స్థానమైన గంగాధర నెల్లూరు నుంచి అతని కుమార్తె కృపాలక్ష్మిని పోటీలో నిలపగా, ఆమె కూడా ఆమె ఓటమిపాలయ్యారు.
బోల్తా కొట్టిన అమాత్యులు
సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అన్నిశాఖల మంత్రులను ఓటర్లు ఊడ్చేశారు. ప్రస్తుత సిట్టింగ్ మంత్రుల్లో.. ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), సీదిరి అప్పలరాజు (పలాస), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), గుడివాడ అమర్నాథ్ (గాజువాక), దాడిశెట్టి రాజా (తుని), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రాజమహేంద్రవరం గ్రామీణ), పినిపే విశ్వరూప్ (అమలాపురం), తానేటి వనిత (గోపాలపురం), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తణుకు), జోగి రమేశ్ (పెనమలూరు), మేరుగు నాగార్జున (సంతనూతలపాడు), విడదల రజని (గుంటూరు పశ్చిమ), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), ఆదిమూలపు సురేష్ (కొండపి), కాకాణి గోవర్దన్రెడ్డి (సర్వేపల్లి), ఆర్కే రోజా (నగరి), బుగ్గన రాజేంద్రనాథరెడ్డి (డోన్), కేవీ ఉషశ్రీచరణ్ (పెనుకొండ) ఓటమి చవిచూశారు.
- తొలి విడత మూడేళ్లపాటు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), పాముల పుష్పశ్రీవాణి (కురుపాం), ఆళ్ల నాని (ఏలూరు) ఓడిపోయారు. తొలి మూడేళ్లూ మంత్రులుగా ఉండి, ప్రస్తుతం బరిలో నిలిచిన అవంతి శ్రీనివాస్ (భీమిలి), కురసాల కన్నబాబు (కాకినాడ గ్రామీణ), చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట), కొడాలి నాని (గుడివాడ), వెలంపల్లి శ్రీనివాస్ (విజయవాడ సెంట్రల్), మేకతోటి సుచరిత (తాడికొండ), బాలినేని శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు) ఓటమి చవిచూశారు. నరసరావుపేట నుంచి లోక్సభ స్థానానికి పోటీచేసిన మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, అనంతపురం లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచిన మాజీ మంత్రి ఎం.శంకరనారాయణ కూడా ఓటమిపాలయ్యారు.
- మాజీ మంత్రి పేర్ని నాని.. ఈసారి తన కుమారుడు కిట్టును మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించగా, ఓటర్లు తిరస్కరించారు. తొలి విడతలో మంత్రిగా చేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్చంద్రబోస్.. ఈసారి కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ని బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు.
తాజా, మాజీలు 39 మందిలో.. ఒక్కరే..
జగన్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా 41 మంది మంత్రులు పనిచేయగా.. వారిలో నేరుగా పోటీచేసిన 35 మందితోపాటు, తమస్థానంలో కుమారులు, కుమార్తెలను బరిలో నిలిపిన ముగ్గురు మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు. రెండు దఫాలు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం మాత్రం, ఎన్నికలకు ముందు తెదేపా గూటికి చేరారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
- తొలి దఫా 25 మంది మంత్రులు ఉండగా, అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా వెళ్లారు. వారి స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు మంత్రి వర్గంలోకి వచ్చారు. రెండో దఫా మంత్రివర్గంలో 25 మందికిగాను 11 మందిని కొనసాగించారు. 14 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
- నారాయణస్వామి తన కుమార్తెను, పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని తమ కుమారులను పోటీ చేయించినా ప్రయోజనం లేకపోయింది.
- రాజ్యసభ సభ్యుడైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఒక్కరే ఈసారి ఎన్నికల బరిలో నిలబడలేదు. మేకపాటి గౌతమ్రెడ్డి అమాత్యునిగా ఉండగానే మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!