TS News: కేంద్రంలో కాంగ్రెస్ ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు: పొన్నం ప్రభాకర్
లోక్సభ స్థానాల సమన్వయకర్తలతో దిల్లీలో ఏఐసీసీ నేతలు సమావేశమయ్యారు.
దిల్లీ: లోక్సభ స్థానాల సమన్వయకర్తలతో దిల్లీలో ఏఐసీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి సమన్వయకర్తలుగా ఉన్న మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో 14 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. నల్గొండలో 3లక్షల మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపిస్తాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు’’ అని వివరించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని భావిస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.