Eatala Rajendar: కేయూ విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా?: ఎమ్మెల్యే ఈటల
కేయూ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: కేయూ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలోనే జరిగిందన్నారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారన్నారు. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టిన ఘతన కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఎమ్మెల్సీ ప్రాపకంతో కేయూ వీసీగా వచ్చిన రమేశ్.. అప్పటి నుంచి విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.
విద్యార్థులను కొట్టారనేది అవాస్తవం: సీపీ
కాకతీయ వర్సిటీలో జరిగిన ఘర్షణ, అనంతరం నెలకొన్న పరిణామాలపై వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.‘‘ కేయూ విద్యార్థులను తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం. ఒక విద్యార్థికి మాత్రమే చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యింది. ప్రశాంత్ అనే విద్యార్థికి అయిన ఫ్రాక్చర్ కూడా నెలరోజుల క్రితం జరిగింది. లేని గాయాలకు విద్యార్థులు కట్లు కట్టుకున్నారు. అనుమానం ఉంటే విద్యార్థులకు మరెక్కడైనా వైద్య పరీక్షలు చేయించవచ్చు’’ సీపీ రంగనాథ్ తెలిపారు.
బంద్కు పిలుపునిచ్చిన విద్యార్థి జేఏసీ
కాకతీయ వర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విశ్వవిద్యాలయంలోని దూరవిద్య కేంద్రం వద్ద 12 విద్యార్థి సంఘాలు ఏకమై రిలే దీక్ష చేపట్టాయి. కేయూ వీసీ రమేశ్ను బర్తరఫ్ చేయడంతో పాటు విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేయూలో జరిగిన అవినీతి అవకతవకలపై రిజిస్ట్రార్కు వివరించే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘం నాయకులపై పోలీసులతో దాడి చేయించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈనెల 12న ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్టు కేయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ తెలిపారు. బంద్కు వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని, అన్ని పాఠశాలలు, కళాశాలలు మద్దతు తెలిపాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?