Mallareddy: త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తా: భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి

కాంగ్రెస్‌ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

Updated : 01 Feb 2024 16:34 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆ షాక్‌ నుంచి తానింకా తేరుకోలేదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలుస్తానని చెప్పారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించిన ఆయన... గతంలో ఇద్దరం తెదేపాలో కలసి పని చేశామని గుర్తు చేశారు. రాజకీయ చర్చకు తావు లేకుండా సీఎంను కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానని తెలిపారు. ‘‘మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలని మా పార్టీ నేతలు అడిగారు. నా కుమారుడికి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరా’’ అని మల్లారెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని