Pinnelli: అర్థరాత్రి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అర్ధరాత్రి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. 

Updated : 29 May 2024 01:06 IST

అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అర్ధరాత్రి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. రోజూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్‌ 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్‌ చేయొద్దంటూ ఇప్పటికే స్పష్టం చేసిన ధర్మాసనం, మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన ఇతర కేసుల్లోనూ ఆ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని