pawan kalyan: దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన నాయకుడు మోదీ

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, కామాఖ్య నుంచి ద్వారక వరకూ ఆసేతుహిమాచలం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Published : 08 Jun 2024 06:32 IST

ఆయన 15 ఏళ్లు పాలిస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతున్నాయి
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

ఈనాడు, దిల్లీ: కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, కామాఖ్య నుంచి ద్వారక వరకూ ఆసేతుహిమాచలం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్విస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఇక్కడి పాత పార్లమెంటు భవనం సెంట్రల్‌ హాల్లో జరిగిన ఎన్డీయే కూటమి నేత ఎంపిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘2014లో ఇదే ప్రాంగణంలో చంద్రబాబు మాట్లాడుతూ మోదీ ఈ దేశాన్ని పదిహేనేళ్లు పాలించబోతున్నారని చెప్పారు. అది ఇప్పుడు జరుగుతోంది. చంద్రబాబు దూరదృష్టి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మోదీ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఈ దేశం ఎవ్వరికీ తల వంచదు. హిమాలయాలు ఎవ్వరికీ తల వంచనట్లే భారత్‌ కూడా తల వంచదు. మోదీ తన చేతల ద్వారా మాలో దేశభక్తి నింపారు. అభివృద్ధి చేసి చూపించారు. ఆయన మార్గదర్శనం, నాయకత్వం వల్ల ఏపీలో ఘనవిజయం సాధించాం. అసెంబ్లీలో 91% విజయం మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైంది. అందుకు ధన్యవాదాలు. అందుకే ఎన్డీయే కూటమి నేతగా జనసేన తరఫున మోదీ పేరును బలపరుస్తున్నా’’ అని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు