‘6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రధాన అర్హత’పై.. బండి సంజయ్ సందేహం
ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్వాగతించారు.
కరీంనగర్: ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ‘సుపరిపాలన దినోత్సవం’ నిర్వహించారు. వాజ్పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో సంజయ్ మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నాయి. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు? తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలి. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి. భారాస చేసిన అప్పుల గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఆ అప్పులను ఎలా తీరుస్తారు? ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో? ప్రజలకు వివరించాలి’’ అని బండి సంజయ్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!