Galla Jayadev: ఏపీలో దొంగ ఓట్లపై చర్యలు తీసుకోండి: పార్లమెంట్లో గల్లా జయదేవ్
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంట్లో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) గళం విప్పారు.
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంట్లో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) గళం విప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏపీలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ ప్రధాన విధి. కానీ, రాష్ట్రంలో ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను డీఆర్వోలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒత్తిళ్లకు లొంగి జాబితాలో మార్పులు చేస్తున్నారు.
ఇదే విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఓటర్ల జాబితా నుంచి తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారనే ఫిర్యాదులో ఆధారాలతో వివరించారు. ఏపీలో ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వెంటనే స్థానికులతో సంబంధం లేని అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించడంపై దృష్టి సారించాలి. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయంటే.. కింది స్థాయి అధికారులపైకి ఉన్నతాధికారులు నెపం నెట్టేస్తున్నారు. సుమారు 10 లక్షల ఫిర్యాదులు చేసినా.. వాటిని పట్టించుకోలేదు.
తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. దొంగ ఓట్లు ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా.. అందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించే విధంగా చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’’ అని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది. -
ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలి
మహిళలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను వెంటనే అరెస్టు చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్