MP Laxman: భారాస మాదిరిగానే కాంగ్రెస్ది మాటల గారడీ: భాజపా ఎంపీ లక్ష్మణ్
కాంగ్రెస్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: కాంగ్రెస్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు వరి పంట బోనస్ ఇవ్వలేదని, వచ్చే సీజన్కు ఇస్తామంటున్నారని చెప్పారు. ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని ఎద్దేవా చేశారు. రైతు స్వరాజ్య వేదిక, కాంగ్రెస్ కిసాన్ సెల్ 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారన్నారు. కానీ మంత్రి ఉత్తమ్ ఆత్మహత్యలే లేవని చెబుతున్నారని విమర్శించారు.
‘‘రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి. భారాస మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడీతో కాలం వెల్లదీస్తోంది. ఆ పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసం, కుట్రలు. తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేదు. కోడ్ను అడ్డుపెట్టుకొని గ్యారంటీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు. మీకెందుకు ఓటు వేయాలి? వంద రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేయనందుకా? రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వనందుకా? రూ.12 వేలు రైతు కూలీల ఖాతాలో వేయనందుకా? ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వనందుకా?
కాళేశ్వరం, మేడిగడ్డ, ధరణి, డ్రగ్స్ మాఫియా, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ అవినీతిపై ఆరోపణలు చేశారు. వీటిలో ఒక్కరినైనా శిక్షించడానికి చర్యలు తీసుకున్నారా? గతంలో భారాస నేతలు అవినీతిపరులన్న రేవంత్రెడ్డి.. ఇప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాస, భాజపా ఒక్కటే అని అపోహ సృష్టించి లాభపడ్డారు. గులాబీ పార్టీ పూర్తిగా చతికిలపడింది. కారు పూర్తిగా ధ్వంసమైతే దాన్ని జాకీ పెట్టి లేపడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారు’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?