MLC Election: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.37% ఓటింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చెదురుమదురు ఘటనలు మినహా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా 4,63,839 ఓట్లలో 72.37 శాతం పోలయ్యాయని ఆర్వో హరిచందన ‘ఈనాడు’కు తెలిపారు.
చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
ఓటుకు వెళ్తూ ప్రమాదాల్లో ముగ్గురి మృతి
జూన్ 5న ఓట్ల లెక్కింపు
సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఓటు వేసేందుకు బారులు తీరిన పట్టభద్రులు
ఈనాడు, నల్గొండ-న్యూస్టుడే యంత్రాంగం: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చెదురుమదురు ఘటనలు మినహా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా 4,63,839 ఓట్లలో 72.37 శాతం పోలయ్యాయని ఆర్వో హరిచందన ‘ఈనాడు’కు తెలిపారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఇది దాటే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో ఓటేశారు. భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి సుబేదారి హంటర్రోడ్డులోని కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. భార్యతో ఓటు వేయించేందుకు వెళ్తుండగా టేకులపల్లికి చెందిన దంపతులు పాయం జానకి(35), కృష్ణయ్య(39); ఓటు వేసి పాల్వంచ వెళ్తుండగా అశ్వాపురం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు కుంజా రాజశేఖర్(32) మరణించారు.
దాడి చేశారని ఠాణా ముందు బైఠాయింపు..
నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో ఓ ప్రధాన పార్టీకి చెందిన వారు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కుమార్ అక్కడికి వెళ్లి అడ్డుకునేందుకు యత్నించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు అశోక్కుమార్పై దాడి చేయడంతో ఆయన స్థానిక పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అదనపు ఎస్పీ రాములు నాయక్ వచ్చి పోలింగ్ ముగిసే వరకు గన్మెన్ను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళనను విరమించారు. ఈ ఘటనలో రెండు వర్గాలు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. సాధారణంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగడంతో ఈ ఎన్నికా అలాగే ఉంటుందనే ఉద్దేశంతో కొందరు ఓటర్లు 4 గంటల అనంతరం వచ్చారు. వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ
ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేయగా..మరో ప్రధాన పార్టీ ఓటుకు రూ.300 చొప్పున ఇచ్చింది. నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తీన్మార్ మల్లన్నను అడ్డుకున్న భాజపా నేతలు
హనుమకొండ నగరం ప్రశాంత్నగర్ తేజస్వీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను హనుమకొండ జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు అమరేందర్రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు. మూడు వాహనాల్లో 15 మంది అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం గేటు దాటి లోపలికి ఎలా వచ్చారని.. వెంటనే బయటకు వెళ్లాలన్నారు. తమను ప్రశ్నించేందుకు మీరెవరంటూ మల్లన్న అనుచరులు అనడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. దీంతో మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కౌన్సిల్ బదులు అసెంబ్లీ..
పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కంపార్ట్మెంట్లపై తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఉప ఎన్నిక(టీఎస్ఎల్సీ) బదులు తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ(టీఎస్ఎల్ఏ) అని ఉండటంతో ఈ విషయాన్ని ఎన్నికల ఆర్వో దాసరి హరిచందన దృష్టికి ‘ఈనాడు -ఈటీవీ’ తీసుకెళ్లింది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం టీఎస్ఎల్ఏ అని రాసి ఉన్న చోట స్టిక్కర్లను అతికించింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని 28వ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలపై ముద్రణ సరిగా లేదని.. మరకలతో కూడిన ఆకారాలు ఉన్నాయని పలువురు ఎన్నికల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 45 బ్యాలెట్ పత్రాలు అలా ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి