Nara Lokesh: 216వ రోజుకు చేరుకున్న నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 216వ రోజుకు చేరింది.

Published : 03 Dec 2023 12:45 IST

కొత్తపల్లి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 216వ రోజుకు చేరింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యండపల్లి జంక్షన్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. నియోజకవర్గంలో పెద్దఎత్తున తెదేపా శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

కొత్తపల్లి నంది విగ్రహం వద్ద నాయీబ్రాహ్మణులు, ఉప్పాడ ప్రధాన సెంటర్‌లో చేనేత కార్మికులు, అమీనాబాదు సెంటర్‌, మూలపేటలో మత్స్యకారులతో సమావేశమయ్యారు. అనంతరం వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను లోకేశ్‌ ఎదుట ఏకరవు పెట్టి, వినతిపత్రాలు ఇచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే పరిష్కారం చూపేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు