Narendra Modi: తిరుగులేని సమర సేనాపతి
వ్యూహం...ప్రతివ్యూహం...ఎన్నికల సమరంలో విజయాన్ని నిర్దేశించేది ఈ అంశాలే. ప్రత్యర్థుల ఎజెండాను కూడా తానే నిర్దేశించి వారి ఊహలకందని విధంగా ఫలితాలను సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకత.
సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హ్యాట్రిక్
ఆధిక్యం తగ్గినా ఆయనే అధినేత
వ్యూహం...ప్రతివ్యూహం...ఎన్నికల సమరంలో విజయాన్ని నిర్దేశించేది ఈ అంశాలే. ప్రత్యర్థుల ఎజెండాను కూడా తానే నిర్దేశించి వారి ఊహలకందని విధంగా ఫలితాలను సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకత. వరుసగా మూడో సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేను గెలుపు బాట పట్టించి తన నాయకత్వ పటిమను మరోసారి చాటారు. సంఖ్యాపరంగా తొలి రెండు దఫాల కన్నా మెజారిటీ తగ్గినప్పటికీ...జాతీయ స్థాయిలో ఆయనే అగ్రగణ్య నేత.
ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని వరుసగా విజయపథంలో నడిపించి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనతను సాధించిన కమలదళ నేతగా చరిత్ర పుటలకెక్కారు నరేంద్ర మోదీ. 1951, 1957, 1962 ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ వరుస విజయాలు సాధించడంతో ఓటమి ఎరుగని నేతగా నెహ్రూ నిలిచారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 479 స్థానాల్లో పోటీచేసి 364 చోట్ల (76%) గెలిచింది. రెండో లోక్సభ ఎన్నికల్లో 490 మంది అభ్యర్థులను బరిలోకి దింపి 371 (దాదాపు76%) సీట్లు సాధించింది. మూడో ఎన్నికలో పోటీకి దిగిన 488 సీట్లలో 361 స్థానాలు (74%) చేజిక్కించుకొంది. ఆ తర్వాత ఏ ప్రధానీ వరుసగా మూడుసార్లు తమ సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలాల్లేవు. ఇప్పుడు మోదీ నేతృత్వంలోని భాజపా సొంతంగా మేజిక్ ఫిగర్ను అందుకోలేకపోయినా దాని నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయిని చేరుకుంది. 2014లో సంపూర్ణ మెజార్టీతో అధికారం చేపట్టి 30 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు. వరుసగా మరో రెండు లోక్సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించి నవభారత రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలిచారు.
నలుదిశలకూ జైత్రయాత్ర
ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేకపోయినా ఆయన ప్రభుత్వం కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించిందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం, మానవ హక్కుల హననం వంటి విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం మోదీ నాయకత్వానికి మూడోసారి జైకొట్టారు. 2014 వరకు మధ్యతరగతి ప్రజల పార్టీగా ఉన్న భాజపాను ప్రధాని మోదీ మరింత విస్తృతం చేయగలిగారు. ఉత్తరాది పార్టీ అనే ముద్రను చెరిపేసి తూర్పు, పడమర, దక్షిణాదికీ విస్తరించేలా చేశారు. కమలదళం అగ్రశ్రేణి నేతలు వాజ్పేయీ, ఆడ్వాణీలకు సాధ్యంకాని విజయాలను ఒడిసిపట్టుకొన్నారు.
వెనుకడుగు ఎరుగని జననేత
1950 సెప్టెంబరు 17న గుజరాత్లోని పేద కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరూ అచ్చెరువొందే స్థాయికి చేరుకున్నారు. 2001లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ రాజీనామాతో ఖాళీ అయిన పీఠాన్ని అధిష్ఠించే అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోదీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు తన నేతృత్వంలో గుజరాత్లో నాలుగు దఫాలు భాజపా ప్రభుత్వాలకు విజయం చేకూర్చిపెట్టారు. 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమలం పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించిందంటే అందుకు కారణం మోదీ సమ్మోహన శక్తే. ప్రధాన మంత్రి పదవికి మోదీ మినహా మరెవరూ అర్హులు కాదన్న విశ్వాసాన్ని దేశ ప్రజల మనస్సులో నాటుకునేలా చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆ నమ్మకం కొంత సడలినా అందరి కంటే ఆయనే ముందు వరుసలో ఉన్నారు.
దృఢచిత్తం ఆయన సొంతం
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పెద్దనోట్ల రద్దు, పాకిస్థాన్ భూభాగాల్లోని ఉగ్రమూకలపై మెరుపుదాడులు, రాజ్యాంగ అధికరణం 370 రద్దు, ముమ్మారు తలాక్ రద్దు, కొవిడ్ సమయంలో నిర్ణయాలు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామాలయ నిర్మాణం లాంటి అంశాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అవన్నీ సామాన్య ప్రజల్లో మోదీ ప్రతిష్టను తగ్గించలేక పోయాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆయన పార్టీని మించి ఎదిగిపోయారన్న భావనను కల్గించాయి. అందుకే ఈ ఎన్నికల్లో భాజపా వాగ్దానాలు అని చెప్పకుండా ‘మోదీ గ్యారంటీ’ పేరుతో విస్తృత ప్రచారం చేశారు. కమలం గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకున్నారు.
మోదీ స్వప్నం వికసిత భారత్
ప్రధానిగా మోదీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత భాజపాలో 75 ఏళ్ల వయసు నిండిన వారందర్నీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు. వచ్చే ఏడాది మోదీ ఆ వయసుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో వయో పరిమితి నిబంధన ఆయనకూ వర్తిస్తుందా? అన్న చర్చ మొదలైంది. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చుతూ మోదీ ఉన్నంత కాలం ఆయనే తమ నాయకుడని అమిత్ షా ప్రకటించారు. మరోవైపు మోదీ కూడా 2047నాటికి భారత్ను వికసిత(అభివృద్ధి చెందిన) దేశంగా చూడాలన్నదే తన కల అని వెల్లడించారు. దీని ప్రకారం సమీప భవిష్యత్తులో రాజకీయ విరమణ చేసే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టమవుతోంది.
వారణాసిలో మోదీ హ్యాట్రిక్
లఖ్నవూ: ప్రధాని నరేంద్రమోదీ వరసగా మూడోసారి కూడా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాకపోతే మునుపటితో పోలిస్తే ఆధిక్యం మాత్రం తగ్గిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్రాయ్పై మోదీ 1,52,513 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్పై 3,71,784 ఓట్ల ఆధిక్యం సాధించిన మోదీ.. 2019లో దానిని 4,79,505 ఓట్లకు పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్రాయ్ పోటీ చేశారు. ఈసారి కూడా మోదీపై ఆయనే పోటీకి దిగారు. రికార్డుస్థాయి మెజార్టీని ప్రధాని సాధిస్తారని భాజపా ప్రచారం చేసినా వాస్తవ ఫలితం దానికి కొంత భిన్నంగా వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు