Narendra Modi: మోదీకే పట్టం
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి.
9న ప్రమాణస్వీకార మహోత్సవం
ఎన్డీయే నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక
మూడోసారి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం
కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నీతీశ్, పవన్కల్యాణ్
రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ
17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖ సమర్పిస్తున్న ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు మెజార్టీ లభించిన నేపథ్యంలో నూతన సర్కారు ఏర్పాటు దిశగా బుధవారం వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. తక్షణం 17వ లోక్సభను రద్దు చేయాలని తీర్మానించింది. మోదీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి ఆ తీర్మాన ప్రతిని అందజేశారు. తనతోపాటు మంత్రిమండలి రాజీనామానూ సమర్పించారు. దీంతో 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి.. మంత్రిమండలి రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా పదవుల్లో కొనసాగాలని మోదీ సహా మంత్రులను కోరారు.
మోదీని ప్రశంసిస్తూ తీర్మానం
ప్రధాని అధికారిక నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే కూటమి నేతలు మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను ప్రశంసిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ‘‘గత పదేళ్లలో మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి రంగం అభివృద్ధి చెందడాన్ని 140 కోట్లమంది భారతీయులు చూశారు. దాదాపు 6 దశాబ్దాల అనంతరం దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజార్టీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో కలిసికట్టుగా పోటీచేసి గెలిచినందుకు మేమంతా గర్విస్తున్నాం. ఇప్పుడు మేమంతా ఏకాభిప్రాయంతో ఆయన్ను మా నాయకుడిగా ఎన్నుకున్నాం. మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు పేదలు, మహిళలు, యువత, రైతులు, పీడిత, వంచిత వర్గాల ప్రజల సేవకు కంకణబద్ధమై ఉంటుంది. దేశ వారసత్వ వైభవాన్ని సంరక్షిస్తూ సర్వతోముఖాభివృద్ధికి, ప్రతిఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తుంది’’ అని అందులో పేర్కొన్నారు.
విచ్చేసిన అతిరథ మహారథులు
ఎన్డీయే సమావేశంలో భాజపా తరఫున పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కూడా భేటీకి హాజరయ్యారు. మొత్తంగా 16 పార్టీలకు చెందిన 21 మంది కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
మోదీకి చంద్రబాబు, నీతీశ్ శుభాకాంక్షలు
ఎన్డీయే సమావేశం ప్రారంభమైన వెంటనే మోదీకి నడ్డా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, నీతీశ్.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో దేశం కొత్త శిఖరాలకు చేరుకుందని మిగతా నాయకులంతా కొనియాడారు. జాతి నిర్మాణం కోసం ప్రధానమంత్రి చేస్తున్న కఠోర శ్రమను అభినందించారు. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే విషయంలో మోదీ స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నారని, ఆయన నేతృత్వంలో ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో తామూ భాగస్వాములం కావాలనుకుంటున్నామని ముక్తకంఠంతో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠను పెంచడంలో, పేదరిక నిర్మూలనలో మోదీ కృషిని కొనియాడారు. మున్ముందు కూడా అదేతరహా సేవకు తామంతా కలిసికట్టుగా మద్దతిస్తామని వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి సంపూర్ణ మెజార్టీ దక్కడాన్ని మోదీ చరిత్రాత్మకంగా అభివర్ణించారు.
గోయల్కు మద్దతు లేఖల అందజేత
సమావేశానంతరం ఎన్డీయే పక్షాల నేతలంతా.. మోదీ నాయకత్వానికి మద్దతిస్తున్నట్లు తమ పార్టీల తరఫున కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖలు అందజేశారు. ఇందులో భాగంగా చంద్రబాబునాయుడు ఆయన నివాసానికి వెళ్లి సుమారు 30 నిమిషాలపాటు సమావేశమయ్యారు.
రేపు రాష్ట్రపతి వద్దకు!
కూటమిపరంగా లాంఛనాలన్నీ పూర్తికావడంతో.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ ఎన్డీయే నేతలంతా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. అంతకంటే ముందు- అదే రోజు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమై మోదీని తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలు, ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులంతా సమావేశమై ఆయన నాయకత్వానికి మద్దతు పలుకనున్నారు.
ఎన్డీయేలో లేకపోతే కలిసి ఎలా పోటీచేస్తాం?: చంద్రబాబు
తాము ఎన్డీయేతోనే ఉన్నట్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే పక్షనేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం దిల్లీలో గల్లా జయదేవ్ నివాసానికి ఆయన వచ్చారు. కూటమి భేటీ ఎలా జరిగిందంటూ అక్కడ విలేకర్లు ప్రశ్నించగా.. ‘ఫలవంతంగా సాగింది’ అని చంద్రబాబు బదులిచ్చారు. ‘మీరు ఎన్డీయేలో ఉన్నారా?’ అని అడిగినప్పుడు.. ‘‘ఎన్డీయేలో లేకపోతే కలిసికట్టుగా ఎలా పోటీ చేస్తాం? రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు మీకెందుకు ఇలాంటి అనుమానాలొస్తున్నాయి’’ అని ఎదురుప్రశ్న వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్