రాజస్థాన్లో కాంగ్రెస్దే గెలుపు.. ఇదే ప్రూఫ్: అశోక్ గహ్లోత్
Ashok gehlot: రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతోందని అశోక్ గహ్లోత్ అన్నారు. దానికి తాజా ఈడీ దాడులే రుజువు అని పేర్కొన్నారు.
Ashok gehlot | జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly elections) మరోసారి కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok gehlot) అన్నారు. అందుకు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులే రుజువని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఈడీని ప్రయోగిస్తోందని గహ్లోత్ ఆరోపించారు.
రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, 2021 పేపర్ లీకేజీకి సంబంధించిన విచారణలో భాగంగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కోచింగ్ సంస్థతో పాటు, కొందరు వ్యక్తుల నివాసాల్లో ఈడీ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. రాజస్థాన్ ప్రజల హృదయాలు గెలవలేక.. ఈడీని భాజపా దుర్వినియోగం చేస్తోందన్నారు.
భాజపాకు సినీనటి గౌతమి రాజీనామా.. పార్టీ నేతలపై ఆరోపణలు!
రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవ్వబోయే హామీల గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని గహ్లోత్ చెప్పారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలౌతున్నాయని, మధ్యప్రదేశ్లోనూ అమలు కాబోతున్నాయని చెప్పారు. ఇదే తరహాలో రాజస్థాన్లోనూ హామీలు అమలు చేస్తామని చెప్పారు. మోదీ తమ గ్యారెంటీలను కాపీ చేస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్లో 200 సీట్లకు గాను నవంబర్ 25న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. భాజపా, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి