Bandi Sanjay: ప్రధాని మోదీతో భేటీ కానున్న బండి సంజయ్‌.. 4న బాధ్యతల స్వీకరణ

ప్రధానమంత్రి నరేంద్రమోదీని భాజపా నేత, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలవనున్నారు. 4న ఉదయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.

Published : 02 Aug 2023 21:58 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీని భాజపా నేత, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలవనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు ఆయన మోదీతో భేటీ అవుతారు. 4న ఉదయం దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ వస్తారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో బండి సంజయ్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని