Janasena: జయహో.. జనసేన
జనసేన జయకేతనం ఎగరవేసింది. తెలుగుదేశం, భాజపాతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 21 చోట్లా గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
జనం మనసులు గెలిచిన సేనాని
పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయభేరి
వైకాపాకు వచ్చినవాటి కంటే దాదాపు రెట్టింపు
శాసనసభలో రెండో స్థానం
ఈ ఫలితాలతో పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఖరారు
ఈనాడు - అమరావతి: జనసేన జయకేతనం ఎగరవేసింది. తెలుగుదేశం, భాజపాతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 21 చోట్లా గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నట్లుగానే వంద శాతం స్ట్రైక్రేట్ సాధించింది. అధికార వైకాపా సాధించిన సీట్ల కంటే రెట్టింపు సీట్లు గెలిచింది. జగన్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 11 స్థానాలకే పరిమితమైతే.. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన అన్నింట్లోనూ గెలిచి, సత్తా చాటింది. శాసనసభలో తెలుగుదేశం తర్వాత అత్యధిక స్థానాలున్న రెండో పార్టీగా అవతరించింది. ఈ విజయంతో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ ‘పవర్’స్టార్గా నిలిచారు. ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లతో జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించబోతుండటం ఆ పార్టీకి మరో మధురానుభూతిని మిగల్చనుంది. మొదటి నుంచి సత్తా చూపిస్తున్న ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లోనే కాకుండా ఉత్తరాంధ్ర, కృష్ణా గుంటూరు, రాయలసీమ జిల్లాల్లోనూ విజయం జనసేనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచిన జనసేనాని పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు. తొలి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం తెనాలి నుంచి గెలుపొందారు.
దారుణ ఓటమి నుంచి విజయం దిశగా..
రాష్ట్ర విభజన తర్వాత జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల్లో బరిలో దిగకుండా తెదేపా, భాజపాలకు మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం భీమవరం, గాజువాకల నుంచి ఓటమి పాలయ్యారు. చాలా త్వరగా ఆ ఓటమి నుంచి బయటపడి పార్టీని ముందుకు నడిపించారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట పంథాలో దూసుకెళ్లారు. 2019 జూన్ నెలలో జగన్ ప్రభుత్వం ఏర్పడితే.. పవన్ ఆగస్టులోనే ప్రజా సమస్యలపై ఉద్యమం ప్రారంభించారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు నిలిపివేసిన వైనంపై ఆగ్రహించారు. రైతులకు కౌలు చెల్లించడం లేదని గళమెత్తారు. జగన్ వంద రోజుల పాలనా వైఫల్యాలపై 33 పేజీల పుస్తకం విడుదల చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై విశాఖలో లాంగ్మార్చ్ నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటమే తన పంథా అని ప్రకటించారు. డొక్కా సీతమ్మ ఆహారశిబిరాలు, రైతు సౌభాగ్య దీక్షలతో కార్యక్రమాలను మరింత పదును ఎక్కించారు. అమరావతి పోరాటంలో పవన్ కల్యాణ్ కీలకపాత్ర పోషించారు. రాజధాని రైతులకు మద్దతు ప్రకటించే క్రమంలో పోలీసులు అడ్డుకోగా ముళ్లకంచెలు సైతం దాటుకుంటూ కాలినడకన పర్యటించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. పవన్ కల్యాణ్ స్వయంగా రహదారుల నిర్మాణానికి శ్రమదానం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.
జనం బాధలు వింటూ..
ముఖ్యమంత్రి ప్రజల బాధలు పట్టించుకోకుండా ప్యాలెస్కు పరిమితమైతే జనసేన అధినేత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి జనవాణి కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సమస్యలు విన్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సొంత డబ్బులతో ఆర్థిక సాయం అందించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సైతం పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచింది. విశాఖలోనూ, చంద్రబాబు అరెస్టు సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లోనూ పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న పోలీసు నిర్బంధాలు ఆ పార్టీ శ్రేణులను మరింత సంఘటిత శక్తిగా మలిచాయి. పవన్ ఓ పక్క పార్టీని ప్రజాజీవితంలో భాగం చేస్తూనే.. తెదేపా, భాజపాతో పొత్తులకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్లారు. ఐదేళ్ల పోరాటం, ఆయన వైఖరి, రాజకీయ నిర్ణయాలు ఈ రోజు జనసేనకు ఈ స్థాయి విజయాన్ని అందించాయి.
ఉభయగోదావరి జిల్లాల్లో 11 చోట్ల విజయం
జనసేనకు మొదటి నుంచి ఉభయగోదావరి జిల్లాలు మంచి పట్టున్న ప్రాంతాలు. పొత్తులో భాగంగా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోనే ఏకంగా 11 స్థానాల్లో పోటీ చేశారు. అన్నింట్లోనూ ఘనవిజయం సాధించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో, ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గంలో సైతం జనసేన గెలిచింది. 2019 ఎన్నికల్లో గెలిచిన రాజోలులో మరోసారి విజయ ఢంకా మోగించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ నియోజకవర్గంలోనూ గ్లాసు గుర్తుతో అభ్యర్థులు గెలుపొందడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్