Congress: మోదీ, అమిత్ షాలను ప్రజలు తిరస్కరించారు: రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ (Congress) నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ (Modi)ని ప్రజలు తిరస్కరించారని విమర్శించారు.
దిల్లీ: 400కిపైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి బరిలో దిగిన ఎన్డీయే.. 300 కన్నా దిగువ స్థానాలకు పరిమితమైంది. భాజపా(BJP)కు సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు రావొచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. 150 సీట్లకు కాస్త అటూఇటూగా విపక్ష కూటమి పరిమితమవుతుందన్న అభిప్రాయమూ మారింది. ఇండియా కూటమి ఇప్పటికే 150కి పైగా స్థానాలు దక్కించుకోగా.. ఇంకా 40కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ దేశం మోదీ, అమిత్షాను తిరస్కరించిందని రాహుల్ గాంధీ అన్నారు.
‘‘రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజలు కలసికట్టుగా పోరాటం చేస్తారని నేను అనుకున్నాను. ఈసందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో చేశారు. ఇండియా కూటమి భాగస్వాములను మేం గౌరవిస్తాం. ఆ కూటమి దేశం కోసం పేదలకు అనుకూలమైన విజన్ను అందించింది. ఈ రాజ్యాంగంపై దాడిని ప్రతిఘటించిన ప్రజలపై ఎంతో గర్వంగా ఉంది’’ అని రాహుల్ అన్నారు. అలాగే పాత మిత్రులైన పీడీపీ, జేడీయూతో సంప్రదింపులు జరుపుతారా? అని అడగ్గా.. ‘‘రేపు మా ఇండియా కూటమి నేతలతో సమావేశం ఉంటుంది. వారితో సంప్రదింపులు చేయకుండా ఎలాంటి ప్రకటనలు చేయం’’ అని స్పష్టంచేశారు. అలాగే రెండు సీట్లలో సాధించిన విజయం గురించి స్పందించారు. రాహుల్ కేరళలో, వయనాడ్తో పాటు యూపీలోని రాయ్బరేలీలో భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ‘‘నేను రెండు స్థానాల్లో ఉండటం కుదరదు. దానిపై ఆలోచిస్తున్నాను. ఏ సీటు వదులుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని వెల్లడించారు.
ఖర్గే మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. ఇది మోదీ, ప్రజలకు మధ్య జరిగిన పోరాటం. ప్రజలు ఎవరికీ పూర్తి ఆధిక్యాన్ని ఇవ్వలేదు. ఇది మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని స్పష్టమవుతోంది. మోదీ పేరు మీదుగా ఓట్లు అడిగారు కాబట్టి ఇది ఆయనకు రాజకీయంగానే గాకుండా నైతికపరమైన ఓటమి’’ అని అన్నారు. ఆయన చేసిన ప్రచారం ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఆయన చెప్పిన అబద్ధాలను ప్రజలు చూశారన్నారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా మమ్మల్ని అడ్డుకుంది. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. కానీ మేం పోరాడాం. ప్రజలు మాకు మద్దతుగా నిలిచారు’’ అని ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఆయన రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?