Pinnelli: పిన్నెల్లి పరార్!
తనను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడంలో, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ విధ్వంసాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... వ్యవస్థలను తప్పుదోవపట్టించడంలోనూ ఆరితేరారు.
హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు
ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్, డ్రైవర్
సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే
పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్లినట్లు ప్రచారం
ఈనాడు - హైదరాబాద్
తనను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడంలో, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ విధ్వంసాన్ని సృష్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... వ్యవస్థలను తప్పుదోవపట్టించడంలోనూ ఆరితేరారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం, బయటికి వచ్చిన కారును వెంబడించడం, కొంతదూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్న డ్రైవర్, గన్మ్యాన్ పొసగని సమాధానాలు ఇవ్వడం... అంతా సినీ ఫక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు తమ గాలింపును కొనసాగిస్తున్నారు.
అదేరోజు హైదరాబాద్కు పలాయనం!
పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి... పోలీసు కేసు అవుతుందని గ్రహించి, తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రామకృష్ణారెడ్డి కేపీహెచ్బీలోని ఇందూ విల్లాస్లో ఉన్న తన నివాసంలో, ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉంటున్నారు. ఈవీఎం ధ్వంసంపై పోలింగ్ రోజే గురజాల పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ మంగళవారం సాయంత్రం దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కావడంతో కలకలం రేగింది. రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలుసుకొని బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం ఇందూ విల్లాస్కు చేరుకుంది.
తెలంగాణలోని సంగారెడ్డి సీసీఎస్ వద్ద ఏపీ పోలీసులు
జాతీయ రహదారిపై వెంటాడిన పోలీసులు
పిన్నెల్లి కారు ఆయన ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు దాన్ని అనుసరించారు. హైదరాబాద్ నుంచి 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా వేగంగా వెళుతుండంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈక్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు. తాత్కాలిక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే హైవేపై ముందుకెళితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించి, కారు పటాన్చెరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్దిదూరం వెళ్లి గణేష్తండా వద్ద ఆగిపోయింది. దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీసులకు కారులో డ్రైవర్, గన్మ్యాన్ మాత్రమే కనిపించడం, వారి వద్ద పిన్నెల్లి ఫోన్ ఉండటంతో ఆశ్చర్యపోయారు. వారిద్దర్నీ విచారించడంతో కారు ఆగగానే ఫోన్ తమకిచ్చిన పిన్నెల్లి... డివైడర్ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని, అందులో ఎక్కి హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని వివరించారు. దాంతో వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి సీసీఎస్కు తరలించారు. దాదాపు అర గంటపాటు వారిని అక్కడ విచారించి అనంతరం తమతో తీసుకెళ్లారు.
ఆ కారులో పిన్నెల్లి లేనట్లేనా...?
పోలీసులు వెంటాడుతున్నప్పటికీ ముందున్న కారులో నుంచి దిగి, రోడ్డు దాటి, మరోవైపునకు వెళ్లి, అక్కడ నుంచి పారిపోవడం ఎంతవరకు సాధ్యమన్నది అంతు పట్టుడంలేదు. దీనిపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము వెంటాడిన కారులో పిన్నెల్లి లేరనే భావిస్తున్నారు. పిన్నెల్లి ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు ఏపీ పోలీసులు పసిగట్టారే తప్ప ఆయన్ని వారు చూడలేదు. జాతీయ రహదారిపై ఆయన కారును అనుసరించారు. చివరకు కారును, అందులో డ్రైవర్, గన్మ్యాన్లను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... పిన్నెల్లి ముందుగానే హైదరాబాద్ నుంచి పరారయ్యారని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే తన ఫోన్ను ఇంట్లో వదిలేసి వెళ్లారని, పోలీసుల రాకను గమనించి ఆయన డ్రైవర్, గన్మ్యాన్లను తన కారులో వెళ్లిపోవాలని ముందుగానే సూచించి ఉంటారని, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆ కారును అనుసరిస్తూ వెళ్లారని తెలుస్తోంది. అంతేతప్ప ఆ కారులో అసలు పిన్నెల్లి లేనేలేరని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ వ్యూహం రచించి ఉంటారని అనుమానిస్తున్నారు. వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్, గన్మ్యాన్లు నోరు విప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం హైదరాబాద్లోని పిన్నెల్లి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు గాలిస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై లుక్ అవుట్ నోటీసులు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ చట్టాల పరిధిలో పది సెక్షన్ల కింద ఈ నెల 20న కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ పోలీసులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లో పిన్నెల్లి ఉన్నారన్న సమాచారంతో గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు సారథ్యంలో నాలుగు పోలీసు బృందాలు బయలుదేరి బుధవారం ఉదయం అక్కడకు చేరుకున్నాయి. ఆయా బృందాల నుంచి ఎస్పీ సమాచారాన్ని తెలుసుకుంటూ సూచనలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు