PM Modi: పాలు పిండకముందే.. నెయ్యి కోసం గొడవ
అయిదేళ్లలో అయిదుగురు ప్రధానుల గురించి మాట్లాడుతున్న విపక్ష ఇండియా కూటమి వైఖరి ఆవు ఇంకా పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం కొట్లాడుకున్నట్లుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ప్రధాని పీఠంపై ఇండియా కూటమిలో కొట్లాట
కాంగ్రెస్ వస్తే.. ‘రామ్ రామ్’ అంటే అరెస్టే
హరియాణా, పంజాబ్ సభల్లో నరేంద్ర మోదీ
మహేంద్రగఢ్/పటియాలా: అయిదేళ్లలో అయిదుగురు ప్రధానుల గురించి మాట్లాడుతున్న విపక్ష ఇండియా కూటమి వైఖరి ఆవు ఇంకా పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం కొట్లాడుకున్నట్లుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలనే చర్చ ఆ కూటమిలో అపుడే మొదలైందన్నారు. గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, పంజాబ్లోని పటియాలా ఎన్నికల సభల్లో ప్రధాని మాట్లాడారు. హరియాణాలో ప్రజలు ‘రామ్ రామ్’ అని పలకరించుకుంటారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘రామ్ రామ్’ అన్నవాళ్లందరినీ అరెస్టు చేస్తుందన్నారు. అలాగే రామమందిరానికి కూడా తాళం వేస్తామంటున్న ఆ పార్టీ ప్రజల విశ్వాసాలను అవమానిస్తోందని చెప్పారు. తన ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ భారత్ను విభజించి ఇప్పటికే రెండు ముస్లిం దేశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇక ఏడు జన్మలెత్తినా ఇండియా కూటమి ప్రభుత్వం రాబోదని మోదీ స్పష్టం చేశారు.
భగవంత్ మాన్ ‘కాగితపు ముఖ్యమంత్రి’
పంజాబ్లోని పటియాలా సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. మంత్రులందరూ కాలక్షేపం చేస్తుండగా.. ‘దిల్లీ దర్బారు’లో హాజరు వేయించుకోవడంలో ఇక్కడి ‘కాగితపు ముఖ్యమంత్రి’ నిమగ్నమై ఉన్నట్లు విమర్శించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతుండగా.. ఇక్కడి ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి ఉందన్నారు. దిల్లీలో కలిసి పోటీ చేస్తున్న భయంకరమైన అవినీతి పార్టీ, సిక్కు వ్యతిరేక దాడుల నిందితురాలైన మరో పార్టీ పంజాబ్లో మాత్రం పరస్పరం తలపడుతున్నట్లుగా ప్రజల ముందు నాటకం ఆడుతున్నాయన్నారు. 1971 యుద్ధంలో 90,000 మందికి పైగా పాక్ సైనికులు భారత్కు లొంగిపోయారని, అప్పుడు తాను అధికారంలో ఉండి ఉంటే ఆ సైనికులను విడుదల చేసే ముందు పాక్ నుంచి కర్తార్పుర్ సాహిబ్ను వెనక్కు తీసుకునేవాడినని మోదీ తెలిపారు. సొంత గురువు అన్నాహజారేకు ద్రోహం చేసి, నిత్యం అబద్ధాలు చెబుతున్న పార్టీ పంజాబ్కు మేలు చేయలేదని ఆప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ముస్లిం రిజర్వేషన్లకే మమత మొగ్గు
‘‘పశ్చిమబెంగాల్లో టీఎంసీ సర్కారు రాత్రికి రాత్రి ముస్లింలకు ఓబీసీ ధ్రువపత్రాలు జారీ చేసింది. వాటిని అందుకున్నవారిలో చొరబాటుదారులు కూడా ఉన్నారు. గత 10 - 12 ఏళ్లుగా ఇచ్చిన ఆ ధ్రువపత్రాలు చెల్లవని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పినా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదించడానికి సిద్ధంగా లేరు. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరుతానని చెబుతున్నారు. ఇవీ ఇండియా కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. మోదీ బతికున్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లు ఎవరూ గుంజుకోలేరని పునరుద్ఘాటించారు.
నెయ్యిగారే హరియాణా బాజ్రా ఖిచిడీ..
మహేంద్రగఢ్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ హరియాణా వంటకాలను కాసేపు తలచుకున్నారు. 1995 ప్రాంతంలో తాను భాజపా రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉండేవాడినని, ఆ సమయంలో ఇక్కడి వంటలను బాగా ఆస్వాదించినట్లు గుర్తు చేసుకున్నారు. నార్నౌల్ పట్టణ సుర్జా హల్వా, మహేంద్రగఢ్ మిఠాయిలు, నెయ్యిగారే సజ్జల ఖిచిడీ మరచిపోలేనన్నారు. ఒక గ్లాసు రబడీ, ఓ రొట్టె, ఒక ఉల్లిపాయ ఉంటే చాలు.. ఈ వేసవిలో మన ఆకలి తీరినట్టే అన్నారు. హరియాణా నెయ్యి, వెన్న దమ్మెంతో నేడు యావత్ ప్రపంచం చూస్తోందని మోదీ తెలిపారు. ఈ ప్రాంత యువత అత్యధికంగా సైన్యంలో చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి