మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్
లాఠీలతోనే తూటాలు ఎదుర్కోవాలని చెప్పేది
ఇప్పుడు ఆయుధాల ఎగుమతి స్థాయికి చేరాం
బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు భయపడతాడు: మోదీ
అంబాలా సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
అంబాలా, దిల్లీ: కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత అంబాలాలో, తర్వాత గోహానాలో మాట్లాడుతూ- మునుపటి యూపీయే పాలనపై పలు విమర్శలు చేశారు. ‘‘జీపుల కుంభకోణానికి పాల్పడడంతో పాటు సైన్యాన్ని, సైనికులను కాంగ్రెస్ వంచించింది. వారి ప్రాణాలు కాపాడే బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు, నాణ్యమైన దుస్తులు, బూట్లు వంటివీ కొనేది కాదు. తుపాకుల బదులు లాఠీలు ఇచ్చి, వాటితోనే ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కోవాలని చెప్పేది. బోఫోర్స్ కుంభకోణం, జలాంతర్గాముల కుంభకోణం, హెలికాప్టర్ స్కాం.. ఇలాంటివి ఎన్నో కాంగ్రెస్ పాలనలో వెలుగుచూశాయి. వీటిద్వారా సైనిక దళాలను బలహీనపరిచేది. ఎందుకో తెలుసా? అలా చేయడం వల్ల విదేశాల నుంచి ఆయుధాల సమీకరణ పేరుతో భారీగా ఆర్జించవచ్చు. నేను అధికారంలోకి వచ్చాక సైనిక దళాలు స్వయం సమృద్ధి సాధించేలా చేశాను. ఒకప్పుడు దిగుమతి చేసుకునే ఆయుధాలను ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్నాం. సైనిక దళాలకు పెద్దసంఖ్యలో సైనికుల్ని సమకూరుస్తున్న హరియాణా ప్రజల నరనరానా దేశభక్తి ప్రవహిస్తుంది’’ అని చెప్పారు.
పాక్ చేతిలో భిక్ష పాత్ర
పొరుగుదేశమైన పాకిస్థాన్ చేతిలో ఒకప్పుడు బాంబులు ఉండేవని, ఇప్పుడు మాత్రం భిక్ష పాత్ర ఉందని మోదీ ఎద్దేవా చేశారు. భారత్లో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రువు భయపడతాడని, ఏం చేయాలన్నా వందసార్లు ఆలోచించుకుంటాడని చెప్పారు. ‘‘జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తిని ఇచ్చిన 370వ అధికరణాన్ని రద్దు చేసింది మా బలమైన సర్కారే. దానివల్ల కశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 370 అనే అడ్డంకిని కబ్రిస్థాన్ (శ్మశానం)లో పూడ్చిపెట్టాం. దానిని పునరుద్ధరించే కలను కాంగ్రెస్ మరిచిపోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ఎన్నికలు కురుక్షేత్ర సమరం. ఒకపక్క అభివృద్ధి, మరో పక్క ఓటు జిహాద్ ఉన్నాయి. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు ఉండడానికి ఆ పదవి ‘మాతూరామ్ జిలేబీ’యా?’’ అని ప్రశ్నించారు.
ఫిర్ ఏక్బార్.. మోదీ సర్కార్
హరియాణాలో ప్రతిఇల్లూ ‘ఫిర్ ఏక్బార్..’ (మళ్లీ ఒకసారి..) అని అంటోందని మోదీ చెప్పినప్పుడు ప్రజలంతా ‘..మోదీ సర్కార్’ అని నినదించారు. లోక్సభ ఫలితాల వెల్లడికి ఇంకా 17 రోజులే మిగిలాయని, కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పక్షాలకు తొలి నాలుగు దశల్లో శూన్యహస్తమే లభించిందని చెప్పారు. సాయంత్రం దిల్లీలో జరిగిన మొదటి ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ- ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇండియా కూటమి ఎంతకైనా తెగిస్తుందని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో దిల్లీలోని 123 ప్రధాన ప్రాంతాల్లో స్థలాలను ఓట్ల దృష్టితో వక్ఫ్బోర్డుకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. అవినీతి పార్టీలైన కాంగ్రెస్, ఆప్ ఒకదానినొకటి సమర్థించుకుంటున్న తీరును లోకం గమనిస్తోందన్నారు. పార్లమెంటు భవనం, 10-జన్పథ్ దర్బార్ కొలువై ఉన్న కొత్తదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకూ కాంగ్రెస్కు బలం లేదని ఎద్దేవా చేశారు. తనకు వారసులంటూ ఎవరైనా ఉంటే అది 140 కోట్ల మంది భారతీయులేనని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి వివిధ దేశాల దౌత్య కార్యాలయాల ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!