PM Modi: ప్రధాని మోదీకి ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’.. ప్రత్యేక సన్మానం

PM Modi: ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా అద్భుత ప్రదర్శన నేపథ్యంలో ప్రధాని మోదీని ఆ పార్టీ ఘనంగా సత్కరించింది.

Published : 07 Dec 2023 11:13 IST

PM Modi | దిల్లీ: భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఘన స్వాగతం లభించింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ (BJP) గెలుపు నేపథ్యంలో గురువారం ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. సమావేశ మందిరంలోకి మోదీ ప్రవేశిస్తుండగా సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనుల మధ్య ఆయనకు స్వాగతం పలికారు.

పార్టీ సభ్యులంతా మోదీ (Narendra Modi) నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పార్టీ (BJP) జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రధానిని సత్కరించారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా మూడింట్లో గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలోనూ ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో పార్టీ పురోగతి సాధించింది. మోదీ నాయకత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

పార్లమెంట్‌ సమావేశాలు జరిగే సమయంలో తమ లోక్‌సభ, రాజ్యసభలోని పార్టీ సభ్యులతో భాజపా (BJP) ప్రతివారం భేటీ అవుతుంది. దీంట్లో మోదీ, అమిత్‌ షా, నడ్డా సహా ఇతర కీలక నేతలు పాల్గొని అజెండా, వ్యూహాలపై సభ్యులకు మార్గనిర్దేశం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు