PM Modi: విపక్షాలది మోసగాళ్ల కూటమి
‘‘జంగిల్రాజ్ వారసుడు (తేజస్వీ యాదవ్ను ఉద్దేశించి) జూన్ 4 తర్వాత మోదీ విశ్రాంతి తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు.
జూన్ 4న గట్టి ఎదురుదెబ్బ ఖాయం
బిహార్, యూపీ సభల్లో మోదీ
‘‘జంగిల్రాజ్ వారసుడు (తేజస్వీ యాదవ్ను ఉద్దేశించి) జూన్ 4 తర్వాత మోదీ విశ్రాంతి తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్గాంధీని ఉద్దేశించి) నా కన్నీరు చూడాలని కోరుకొంటున్నారు. వీరిద్దరి యూపీ మిత్రుడు (అఖిలేశ్ యాదవ్) నేను జీవిత చరమాంకానికి చేరుకున్నందునే వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. పుట్టుకతో శ్రీమంతులైన వీరికి పోరాటాలతో నిండిన జీవితమంటే ఏమిటో తెలియదు.’’
మోదీ
మహారాజ్గంజ్, మోతిహారీ (బిహార్)/ప్రయాగ్రాజ్ (యూపీ): తీవ్రమైన మతతత్వ, కులతత్వ, వారసత్వ రాజకీయాలను వందశాతం చేస్తున్న ‘ఇండియా’ కూటమి మోసగాళ్ల కలయికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై దాడికి దిగారు. రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలకు బాధ్యులైన వీరంతా రాజకీయ కూటమిలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బిహార్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించారు. బిహార్లోని మహారాజ్గంజ్, తూర్పు చంపారన్ లోక్సభ నియోజకవర్గాల సభల్లో మాట్లాడుతూ.. అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ సనాతనధర్మం వ్యతిరేకుల పక్షాన నిలుస్తున్న ఇండియా కూటమికి జూన్ 4న ఫలితాల్లో గట్టి ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. వీరి పాపాలతో దేశం ముందుకు సాగదన్నారు. బిహార్ను ఏళ్లతరబడి పాలించిన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ పుట్టిన ఈ నేలను దోపిడీ, వలసలకు కేంద్రంగా మార్చాయన్నారు. ఎన్డీయే పాలనలో వాటన్నింటికీ అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బిహార్ నుంచి వలస వచ్చినవారిని గౌరవంగా చూసుకున్నామని మోదీ గుర్తు చేశారు. పంజాబ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బిహారీల గురించి ఇండియా కూటమి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినపుడు కాంగ్రెస్ రాజకుటుంబం నోరు మెదపలేదని విమర్శించారు. దేశంలో పేదల కడుపులు మాడ్చి.. స్విస్ బ్యాంకుల్లో నోట్లకట్టలు దాచుకొన్నవారికి తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సామాన్యుల కష్టాలు అర్థం కావన్నారు.
వారికి కుంభమేళా కంటే ఓటుబ్యాంకే ముఖ్యం
‘‘ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల హయాంలో కుంభమేళాల్లో ఏం జరిగింది? తొక్కిసలాటల్లో ఎంతోమంది భక్తులు చనిపోయారు. అభివృద్ధి నిరోధక పార్టీలైన వీటికి కుంభమేళా ఏర్పాట్ల కంటే ఓటుబ్యాంకును కాపాడుకోవడమే ముఖ్యం’’ అని ప్రధాని ధ్వజమెత్తారు. యూపీలోని ప్రయాగ్రాజ్ సభలో మోదీ మాట్లాడుతూ.. 2024లో జరుగుతున్న ఈ ఎన్నికలు భారత భవిష్యత్తు అనే త్రివేణి ఏ దిశలో పయనించాలో నిర్ణయిస్తాయని చెప్పారు. జీ20 వంటి సమావేశాల నిర్వహణ ద్వారా భారత్కు విదేశాల్లో లభిస్తున్న ఆదరణను ఇండియా కూటమి జీర్ణం చేసుకోలేకపోతోందని విమర్శించారు. ‘‘రామమందిరాన్ని బహిష్కరించి, సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోల్చిన వ్యక్తులను వచ్చే ఏడాది కుంభమేళా ఏర్పాట్లకు అనుమతిద్దామా? శ్రీరాముణ్ని అవమానించినవారిని ప్రయాగ్రాజ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరు’’ అని ప్రధాని తెలిపారు.
మేము వచ్చాకే మహిళలకు రక్షణ : ప్రధాని
వారణాసి: ఉత్తర్ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో మహిళలకు రక్షణ లభిస్తోందని, ఆకతాయిలు నేరాలకు పాల్పడే ధైర్యం చేయలేకపోతున్నారని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఎంపీగా తాను పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గ పరిధిలోని మహిళలతో మంగళవారం ఏర్పాటుచేసిన సదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ పాలనలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడేవారన్నారు. అత్యాచారం కేసులో దోషులకు మరణశిక్షను వ్యతిరేకిస్తూ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయంసింగ్ యాదవ్ దశాబ్దం కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ‘‘అబ్బాయిలన్నాక తప్పులు చేస్తారు’’ అంటూ అప్పట్లో ములాయం వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు