Modi: ఆశీస్సుల కోసం అగ్ర నేతల ఇళ్లకు మోదీ

ఎన్డీయే లోక్‌సభా పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. భాజపా కురువృద్ధుడు ఎల్‌.కె.అడ్వాణీ, సీనియర్ నేత మురళీ మనోహర్‌ జోషిలను మర్యాదపూర్వకంగా కలిశారు. 

Updated : 07 Jun 2024 16:22 IST

దిల్లీ: ఎన్డీయే లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ (PM Modi).. భాజపా కురువృద్ధుడు ఎల్‌.కె.అడ్వాణీని (LK Advani) మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఆయన ఇంటికివెళ్లిన మోదీ... వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న విషయాన్ని ఆయనకు స్వయంగా చెప్పారు. ఇద్దరు నేతలూ వివిధ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి ఇంటికి వెళ్లిన మోదీ.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఎన్డీయే కూటమి నేతలతో కలిసి మోదీ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు. తమ వద్ద ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని చెబుతూ.. అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేయనున్నారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీని లోక్‌సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలను సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని