Janasena: పోలవరం, పి.గన్నవరం అభ్యర్థులను ప్రకటించిన జనసేన

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిని జనసేన పార్టీ ఖరారు చేసింది.

Updated : 23 Mar 2024 19:24 IST

అమరావతి: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ(Janasena)ఖరారు చేసింది. గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం, బాలరాజు పోలవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరికీ నియామక పత్రాలను అందజేశారు. తెదేపా, భాజపా, జనసేన పొత్తులో భాగంగా తొలుత పి.గన్నవరం సీటును తెదేపాకు కేటాయించారు. మహాసేన రాజేశ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని