Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసు కేసు

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (MLA Kaushik Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 04 Dec 2023 17:51 IST

హుజూరాబాద్: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (MLA Kaushik Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల లెక్కింపు వేళ ఎన్నికల నియమావళిని ఆయన ఉల్లంఘించడంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ ఈ కేసు నమోదు చేశారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వద్ద కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంది. భారాస కార్యకర్తలు గుమిగూడి ఉండటంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గుమిగూడిన వారందర్నీ పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనలో పాడి కౌశిక్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని