Political Parties: ఇబ్బడిముబ్బడిగా రాజకీయ పార్టీలు
దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ పార్టీల సంఖ్యలో 104 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) విశ్లేషణలో వెల్లడైంది.
2009తో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 104% అధికం
ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడి
దిల్లీ: దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ పార్టీల సంఖ్యలో 104 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) విశ్లేషణలో వెల్లడైంది. 2009 లోక్సభ ఎన్నికల్లో 368 పార్టీలు పోటీ చేయగా, 2014లో 464, 2019లో 677, 2024లో 751 రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 8,360 మంది పోటీచేస్తుండగా వారిలో 1,333 మంది జాతీయ పార్టీల తరఫున, 532 మంది ప్రాంతీయ పార్టీల తరఫున, 2.580 మంది నమోదైన గుర్తింపు పొందని పార్టీల తరఫున పోటీచేస్తున్నారు. వీరందరితోపాటు 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
- జాతీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన 1,333 మంది అభ్యర్థుల్లో 433 మంది నేరచరితులు. వారిలో 295 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- జాతీయ పార్టీలతో పోల్చితే ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితుల నిష్పత్తి ఎక్కువగా ఉంది. 532 మంది ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల్లో 249 మంది నేరచరితులు కాగా, వారిలో 169 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- నమోదైన గుర్తింపు పొందని పార్టీల నుంచి బరిలో నిలిచిన 2,580 మంది అభ్యర్థుల్లో 401 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 316 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
- 3,915 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 550 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, వారిలో 411 మందిపై అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
- జాతీయ పార్టీల్లో 906 మంది (మొత్తం అభ్యర్థులు 1,333), ప్రాంతీయ పార్టీల్లో 421 మంది (మొత్తం అభ్యర్థులు 532), నమోదైన గుర్తింపు పొందని పార్టీల్లో 527 మంది (మొత్తం అభ్యర్థులు 2,580), స్వతంత్ర అభ్యర్థుల్లో 673 మంది (మొత్తం అభ్యర్థులు 3,915) కోటీశ్వరులు ఉన్నారు.
పోటీలో ఉన్న సిటింగ్ ఎంపీల ఆస్తుల్లో పెరుగుదల
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న 324 మంది సిటింగ్ ఎంపీల సగటు ఆస్తుల విలువ గత ఐదేళ్లలో 43 శాతం మేర పెరిగినట్లు ఏడీఆర్ తెలిపింది. 2019లో వీరి సగటు ఆస్తుల విలువ రూ.21.55 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.30.88 కోట్లకు చేరింది.
మహిళా అభ్యర్థులు పెరుగుతున్నారు..
లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మహిళల సంఖ్య గత 15 ఏళ్లుగా స్థిరంగా పెరుగుతోందని ఏడీఆర్ తెలిపింది. 2009 ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 7 శాతం మంది మహిళలు ఉండగా, 2024లో ఆ శాతం 9.6కు చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు. వారిలో 8,337 మంది అభ్యర్థుల వివరాలను ఏడీఆర్ విశ్లేషించింది. ఈ 8,337 మంది అభ్యర్థుల్లో 797 మంది (9.6 శాతం) మహిళలు ఉన్నారు. 2009 (7శాతం), 2014 (8శాతం), 2019 (9శాతం)లతో పోల్చితే ఇదే అధికం కావడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా తరఫున మొత్తం 440 మంది అభ్యర్థులు పోటీచేస్తుండగా వారిలో 69 మంది (16%) మహిళలు కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరఫున 327 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 41 మంది (13%) మహిళా అభ్యర్థులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు