AP Poll violence: నేతల స్వార్థానికి మా బిడ్డల భవిష్యత్తు బలి
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేశ్రెడ్డి ఓటేద్దామని నరసరావుపేట వచ్చారు. వైఎస్సార్ మీద అభిమానంతో వైకాపా నిర్వహించే కార్యక్రమాల్లోనూ తరచూ పాల్గొంటున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో జరిగిన అల్లర్లలో పాల్గొన్నారు.
ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో?
అల్లర్లలో ఇరుక్కున్న నిందితుల తల్లిదండ్రుల ఆవేదన
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
మాచర్ల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పోలింగ్ రోజు నెలకొన్న ఘర్షణ
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేశ్రెడ్డి ఓటేద్దామని నరసరావుపేట వచ్చారు. వైఎస్సార్ మీద అభిమానంతో వైకాపా నిర్వహించే కార్యక్రమాల్లోనూ తరచూ పాల్గొంటున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో జరిగిన అల్లర్లలో పాల్గొన్నారు. నాయకుడి ప్రకటనలతో రెచ్చిపోయి కర్రలతో రోడ్డుపై పరుగులు పెట్టారు. ప్రస్తుతం పోలీసుల నుంచి 41ఏ నోటీసు రావడంతో అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎప్పుడూ గొడవల జోలికి పోని తమ కుమారుడు ఇలా కేసుల్లో ఇరుక్కోవడంతో ఆందోళన చెందుతున్నారు.
మాచర్లకు చెందిన ఓ యువకుడు డిగ్రీ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వెలువడిన గ్రూపు-2 ప్రిలిమ్స్ పరీక్షలో కూడా అర్హత సాధించాడు. పిన్నెల్లి సోదరులంటే ఇతనికి పిచ్చి. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి చదువు పక్కనపెట్టి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో జరిగిన అల్లర్ల ఘటనలో పాల్గొన్నాడు. వీడియోలో కనిపించిన ఆనవాళ్లతో కేసు నమోదు చేసి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయినట్టేనని అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
ఇలా పల్నాడు జిల్లాలో పోలింగ్ అల్లర్లలో తలదూర్చిన యువకుల కుటుంబాలు భయాందోళనలతో బతుకుతున్నాయి. ఇళ్లకు పోలీసులు రావడం, నోటీసులు, అరెస్టులు అంటూ తిరగడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఎన్నికల గొడవల్లో తలదూర్చిన యువత సొంతూళ్లో ఉండలేక ఎక్కడో దూరాన ఉన్న బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. సినిమాలు చూసి కొందరు.. హీరోల్లా వెంటపడి తరిమికొట్టే అవకాశం వచ్చిందని మరికొందరు.. తమ అభిమాన నేత రెచ్చగొట్టారని ఇంకొందరు.. ఐదేళ్లుగా తమను హింసించి అక్రమ కేసులు పెట్టారని, ఇప్పుడు సమయం వచ్చిందని మరికొందరు.. ఇలా పోలింగ్ రోజు, మరుసటి రోజున జరిగిన అల్లర్లలో తలదూర్చారు. నరసరావుపేటలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి, కర్రలు చేతపట్టి దాడులకు దిగారు. కారంపూడిలో ఏకంగా ఇనుపరాడ్లు చేతపట్టుకుని ప్రధాన రహదారిపై పట్టపగలు వీరంగం వేశారు. వెనకుండి వారిని రెచ్చగొట్టిన నాయకులంతా ప్రస్తుతం హాయిగా ఏసీ గదుల్లో సేదతీరుతున్నారు. కానీ అమాయకులైన అనుచరణగణమంతా బలైంది. అప్పుడు రెచ్చగొట్టిన నేతలు నేడు మీకేం కాదని బాధిత యువతకు భరోసా ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. దీంతో అల్లర్ల కేసుల్లో ఇరుక్కున్నవారి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెడకు కేసుల ఉచ్చు
పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన గొడవలపై ఈసీ సీరియస్గా స్పందించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం జిల్లాలో పర్యటించింది. సిట్ రాక ముందు చాలా స్టేషన్లలో కేసుల్లో పురోగతి లేదు. కొంతమందికే 41ఏ నోటీసులిచ్చి వదిలేశారు. సిట్ పర్యటించాక పోలింగ్ రోజున, మరుసటి రోజున జరిగిన అల్లర్ల వీడియోల సీసీఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించి, ఎవరెవరు పాల్గొన్నారో అందరిపై కేసులు పెట్టడం ముమ్మరం చేశారు. అంతేకాదు అంతకుముందు సాధారణ కేసులు పెట్టిన వారిపై తాజాగా 307 కేసులు పెడుతున్నారు. అప్పుడేదో ఉద్రేకంలో రాళ్లు, కర్రలు పట్టుకుని పరుగులు పెట్టామే కానీ కావాలని చేసింది కాదని యువత ఇప్పుడు బాధపడుతున్నారు.
ఇందులోనూ కాసుల కక్కుర్తి..
అల్లర్లలో పాల్గొన్న వారికి 41ఏ నోటీసులు ఇచ్చి ఠాణాకు రప్పించాక కొందరు పోలీసులు ‘కాసుల’ బేరమాడుతున్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్ పరిధిలోని ఓ ఎస్సై తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదని 41ఏ నోటీసులు అందుకున్నవారు చెబుతున్నారు. సిట్ రాక ముందు ఆ ఎస్సై కేసులు లేకుండా చూస్తానని తమ వద్ద రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ దండుకున్నారని.. ఇప్పుడేమో కేసులు కట్టి తమను అదుపులోకి తీసుకుని హింసిస్తున్నారని వాపోయారు. అసలే కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉంటే మరోపక్క డబ్బుల కోసం రాబందుల్లా కొందరు పోలీసులు పీక్కుతింటున్నారని వివాదాల్లో తలదూర్చిన బాధితులు బాధపడుతున్నారు.
రాజకీయాలు వద్దని చెప్పినా వినలేదు..
- మాచర్ల నియోజకవర్గంలో ఓ తల్లి
మనకు రాజకీయాలు పడవు. అధికార పార్టీ వెంట వెళ్లొద్దని ఎన్నోసార్లు చెప్పా. వినలేదు. పోలింగ్ రోజు జరిగిన గొడవల్లో మా అబ్బాయికి రాళ్ల దెబ్బలు తగిలాయి. మర్నాడే ఊరి నుంచి పంపేశా. కేసులు పెట్టి జైల్లో పెడతారని బాధగా ఉంది. నా కోడలు ప్రస్తుతం గర్భిణి. అంత ఆర్థిక స్తోమత లేనివాళ్లం. ఫలితాలు విడుదలైన వారం వరకూ రావద్దని ఒట్టేయించుకుని పంపించా. దూరంగా ఉన్నా వాడు క్షేమంగా ఉండడమే కావాలి.
నాన్న ఎక్కడికెళ్లాడు, ఎప్పుడొస్తాడు? అని పిల్లలు అడుగుతున్నారు..
- నరసరావుపేటలో ఓ మహిళ
ఉపాధి కోసమని నరసరావుపేట వచ్చాం. నా భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేవాడు. పోలింగ్రోజు సాయంత్రం వాళ్ల స్నేహితులు పిలిస్తే గుంటూరు రోడ్డులో గొడవ జరుగుతోందని వెళ్లాడు. పోలీసులేమో 41ఏ నోటీసులిచ్చారు. ఆయన్ను జైల్లో పెడితే మా బతుకులేం కావాలి? కొన్నిరోజులైనా ఈ గొడవలకు దూరంగా ఉండాలని మా బంధువుల ఇంటికి పంపించా. రోజూ పిల్లలు.. అమ్మా నాన్న ఎప్పుడొస్తాడు? ఎక్కడున్నాడు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు