Lok Sabha Elections: కులమతాలదే పైచేయి!
కులమతాల ప్రాభవం ఉన్న ఉత్తర్ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో 25వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 162 మంది పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ 14లో 9 భాజపా, బీఎస్పీ 4, సమాజ్వాదీ ఒకటి గెలుచుకున్నాయి.
భాజపా, సమాజ్వాదీల అడ్డాల్లో పోరు
ఉత్తర్ప్రదేశ్ ఆరోవిడతలో 14 స్థానాల్లో పోలింగ్
అలహాబాద్, లఖ్నవూ నుంచి నీరేంద్ర దేవ్
కులమతాల ప్రాభవం ఉన్న ఉత్తర్ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో 25వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 162 మంది పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ 14లో 9 భాజపా, బీఎస్పీ 4, సమాజ్వాదీ ఒకటి గెలుచుకున్నాయి. పూర్వాంచల్లోని ఈ నియోజకవర్గాల్లో మాఫియా, బలవంతుల ఆధిపత్యమూ అధికమే. యాదవ్లు, ముస్లింలు, కుర్మీలు, బ్రాహ్మణులు, హిందువుల ఆధిపత్యమున్న ఈ ప్రాంతాల్లో భాజపా, సమాజ్వాదీ, బీఎస్పీ గెలుస్తూ వస్తున్నాయి.
గోమతీ తీరం
- అయోధ్య డివిజన్లోని సుల్తాన్పుర్ గోమతీ తీరాన ఉంది. ఈ నియోజకవర్గంలో 93శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. 21.29% ఎస్సీలున్నారు. అత్యధికంగా ఉన్న ఓబీసీలు ఫలితాన్ని నిర్ణయిస్తారు. ముస్లింలు, ఠాకుర్లు, బ్రాహ్మణులూ గణనీయంగానే ఉన్నారు.
- 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి మేనకా గాంధీ, సమాజ్వాదీ తరఫున రాంభౌల్ నిషాద్, బీఎస్పీ టికెట్పై ఉద్రాజ్ వర్మ పోటీ చేస్తున్నారు. మరోసారి మేనకా గాంధీకే అనుకూలంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అంబేడ్కర్కు గుర్తుగా..
- రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్కు గుర్తుగా అంబేడ్కర్ నగర్ జిల్లాను 1995లో మాయావతి ఏర్పాటు చేశారు. టాండా ఎర్రమట్టికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. వ్యవసాయం, మరమగ్గాలు ఇక్కడ జీవనాధారం. 4లక్షల మంది దళితుల నిర్ణయంపైనే ఇక్కడి ఫలితం ఆధారపడి ఉంది.
- 2014లో భాజపా, 2019లో బీఎస్పీ ఇక్కడ విజయం సాధించాయి. ఈసారి భాజపా తరఫున రితేశ్ పాండే, సమాజ్వాదీ అభ్యర్థిగా లాల్జీ వర్మ, బీఎస్పీ నుంచి ఖమర్ హయత్ పోటీ చేస్తున్నారు. మాయావతి ఒకప్పుడు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో నేతలంతా భాజపా, సమాజ్వాదీలవైపు వెళ్లిపోయారు. దీంతో రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఉ‘సిరి’
- దేశంలోనే ఉసిరి ఉత్పత్తికి ప్రతాప్గఢ్ పేరుగాంచింది. ఎస్సీలు 19.9%, ముస్లింలు 14% ఉన్నారు. ఎన్నికల ఫలితాన్ని రాజ్పూత్లు, కుర్మీలు, బ్రాహ్మణులు శాసిస్తారు.
- 2014లో అప్నాదళ్, 2019లో భాజపా గెలిచాయి. భాజపా అభ్యర్థిగా సంగం లాల్ గుప్తా, సమాజ్వాదీ నుంచి శివ్పాల్ సింగ్ పటేల్ తలపడుతున్నారు. రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, మోదీ మ్యాజిక్ ప్రభావం ఉన్నా విజయంపై ఉత్కంఠ నెలకొంది.
మల్లెల సుగంధం
- గోమతీ తీరాన ఉన్న జౌన్పుర్ మల్లెల సుగంధాలకు కేంద్రం. ఇక్కడి స్వీట్లూ ప్రసిద్ధి పొందాయి. హిందువులు 88శాతం ఉంటారు. రాజ్భర్లు, కొయిరీలు, గుర్జార్లు, ప్రతీహార్లు అధికంగా ఉంటారు.
- 2014లో భాజపా, 2019లో బీఎస్పీ గెలిచాయి. భాజపా తరఫున కృపాశంకర్ సింగ్, సమాజ్వాదీ నుంచి బాబు సింగ్ కుశ్వాహా, బీఎస్పీ అభ్యర్థిగా శ్యాం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముక్కోణ పోటీ జరుగుతోంది.
సారవంత నేల
- ఎస్సీలకు రిజర్వు అయిన లాల్ గంజ్లో సారవంతమైన భూములున్నాయి. ఆలుగడ్డలు, మొక్కజొన్న, గోధుమ, కూరగాయలు ప్రధాన పంటలు. ముస్లింలు, యాదవులు, దళితుల జనాభా అధికం. వీరే ఫలితాన్ని నిర్ణయిస్తారు.
- 2014లో భాజపా, 2019లో బీఎస్పీ గెలిచాయి. ఈసారి భాజపా తరఫున నీలం సోంకర్, సమాజ్వాదీ నుంచి దరోగా ప్రసాద్ సరోజ బరిలోకి దిగారు. గట్టి పోటీ నెలకొంది.
బౌద్ధ క్షేత్రం
- నేపాల్ సరిహద్దుల్లోని హిమాలయాలవద్ద శ్రావస్తీ ఈ నియోజకవర్గం ఉంటుంది. బౌద్ధ క్షేత్రం కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కోసల రాజ్యం రాజధానిగా ఉండేది. 17శాతం ఎస్సీలున్నారు. 68% హిందువులున్నారు.
- 2014లో భాజపా, 2019లో బీఎస్పీ గెలిచాయి. ఈసారి భాజపా అభ్యర్థిగా సాకేత్ మిశ్ర, సమాజ్వాదీ నుంచి రాం శిరోమణి వర్మ, బీఎస్పీ తరఫున ముయినుద్దీన్ అహ్మద్ ఖాన్ తలపడుతున్నారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో ముస్లింల ఓట్లే కీలకం. 20శాతంగా ఉన్న బలహీనవర్గాల వారి ఓట్లపై అన్ని పార్టీలు గురిపెట్టాయి.
నెహ్రూ నియోజకవర్గం
- తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోటీ చేసిన నియోజకవర్గం ఫూల్పుర్. వరుసగా 3సార్లు ఆయన గెలిచారు. ఓబీసీలే ఫలితాన్ని తేలుస్తారు.
- 2014, 2019లలో భాజపా గెలిచింది. అయితే 2018లో జరిగిన ఉప ఎన్నికలో సమాజ్వాదీ విజయం సాధించింది. భాజపా నుంచి ప్రవీణ్ పటేల్, సమాజ్వాదీ అభ్యర్థిగా అమర్నాథ్ సింగ్ మౌర్య, బీఎస్పీ తరఫు జగన్నాథ్ పాల్ పోటీ చేస్తున్నారు. ఎస్సీలు, ఓబీసీలు సమాజ్వాదీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఠాకుర్లు, లాలాలు, బనియాలు, బ్రాహ్మణుల మద్దతు భాజపాకు లభిస్తోంది.
సాధువులు, పండితుల భూమి
- ఉత్తర్ప్రదేశ్లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచే నియోజకవర్గం ఆజంగఢ్. వివాదాస్పద సమాజ్వాదీ నేత ఆజంఖాన్కు ఇక్కడ గట్టి పట్టు ఉండటమే కారణం. యూపీ తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం సాధువులు, పండితులకు నిలయం. ఆశ్రమాలు అధికంగా ఉంటాయి. ఇక్కడ 21% యాదవులు, 19% దళితులు, 17% ముస్లింలు ఉంటారు.
- 2014, 2019లలో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఈసారి భాజపా నుంచి దినేశ్ లాల్ యాదవ్, సమాజ్వాదీ తరఫున ధర్మేంద్ర యాదవ్ తలపడుతున్నారు. ముస్లింలు, యాదవుల అండతో మరోసారి గెలిచేందుకు సమాజ్వాదీ ప్రయత్నిస్తోంది.
బుద్ధుడి జన్మస్థలం
-
రాప్తీ నదిపై ఉన్న డుమారియా గంజ్ గౌతమ బుద్ధుడి జన్మ స్థలమైన లుంబిని (కపిలవస్తు) ఉన్న నియోజకవర్గం. 54% హిందువులు, 43% ముస్లింలు. మొత్తం మీద 12% ఎస్సీలుంటారు.
- 2014, 2019లలో భాజపా నేత జగదాంబికా పాల్ ఇక్కడి నుంచి గెలిచారు. మూడోసారి భాజపా అభ్యర్థిగా జగదాంబికా పాల్, సమాజ్వాదీ నుంచి భీష్మ శంకర్, బీఎస్పీ పక్షాన నదీం పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్పై భాజపా నమ్మకంగా ఉంది.
వశిష్ఠుడి ఆశ్రమం
-
వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతం బస్తీ. హిందీ పండితుడు, విమర్శకుడు, కథా రచయిత రామచంద్ర శుక్లా సొంత ప్రాంతమిది. 21% ఎస్సీలుంటారు.
- 2014, 2019లలో భాజపా నేత హరీశ్ ద్వివేది విజయం సాధించారు. మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ తరఫున రాం ప్రసాద్ చౌధరి, బీఎస్పీ నుంచి లవ్కుష్ పటేల్ బరిలో ఉన్నారు. హ్యాట్రిక్పై ద్వివేది కన్నేశారు.
మహిళలే మహారాణులు
- పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మచిలీశహర్. ఇక్కడ ప్రతి వేయి మంది పురుషులకు 1,040 మంది మహిళలున్నారు. 22.7% ఎస్సీలున్నారు. 90 శాతం హిందువులే.
- 2014, 2019లలో భాజపా గెలిచింది. భాజపా నుంచి భోలానాథ్, సమాజ్వాదీ తరఫున ప్రియా సరోజ్, బీఎస్పీ అభ్యర్థిగా కృపా శంకర్ సరోజ్ బరిలోకి దిగారు. ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని సమాజ్వాదీ ప్రయత్నిస్తోంది. అటు భాజపా మెజారిటీ పెంచుకోవాలని తలపోస్తోంది.
కబీర్ దాస్ కోసం..
- ప్రముఖ సాధువు, కవి కబీర్ దాస్ పేరుతో సంత్ కబీర్ నగర్ ఏర్పాటైంది. హొసైరీ పరిశ్రమకు ప్రసిద్ధి. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. 22% ఎస్సీలు, 76శాతం హిందువులు ఉన్నారు.
- 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. భాజపా అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ నిషాద్, సమాజ్వాదీ తరఫున లక్ష్మీకాంత్ పప్పు నిషాద్, బీఎస్పీ నుంచి నదీం అష్రాఫ్ తలపడుతున్నారు. భాజపాకు సమాజ్వాదీ సవాలు విసురుతోంది. ముస్లింలలో ప్రాబల్యమున్న నదీం బీఎస్పీ తరఫున బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
త్రివేణీ సంగమం
- లాల్ బహదూర్ శాస్త్రి, వీపీ సింగ్, మురళీ మనోహర్ జోషి, అమితాబ్ బచ్చన్ లాంటి ఉద్ధండులు పోటీ చేసిన అలహాబాద్ గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం. ఇది భాజపాకు కంచుకోట. ముస్లింలు, భూమిహార్లు, బ్రాహ్మణులు ఉంటారు.
- 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా అభ్యర్థిగా నీరజ్ త్రిపాఠీ, కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్, బీఎస్పీ తరఫున రమేశ్ కుమార్ పటేల్ బరిలో నిలిచారు. ముగ్గురూ లోక్సభ ఎన్నికల్లో పోటీకి కొత్తవారే.
తివాచీల నగరం
- ఉత్తర్ ప్రదేశ్లో అత్యంత చిన్న జిల్లా అయిన భదోహీ తివాచీల తయారీకి ప్రసిద్ధి. గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. బనారస్ చీరలు, వెదురు బుట్టల తయారీకీ ఈ ప్రాంతం పేరొందింది. 45శాతం ముస్లింలుంటారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం కనిపించదు.
- 2014, 2019లలో మోదీ ప్రభంజనం కారణంగా భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి వినోద్ కుమార్ బింద్, తృణమూల్ తరఫున లలితేశ్పతి త్రిపాఠి, బీఎస్పీ అభ్యర్థిగా హరిశంకర్ పోటీ చేస్తున్నారు. తృణమూల్ అభ్యర్థికే ఈ నియోజకవర్గంలో మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ బ్రాహ్మణుల ఆధిపత్యముంటుంది. త్రిపాఠి ఆ వర్గానికి చెందినవారే. ఆయనకు యాదవులు, ముస్లింలూ మద్దతిస్తున్నారు. దళితులు, అగ్రవర్ణాలవారి ఓట్లపై భాజపా ఆధారపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్