Ponnam Prabhakar: అమలు చేయని హామీలపై చర్చకు భాజపా సిద్ధమా?: మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే భాజపా నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
కరీంనగర్: కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే భాజపా నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కరీంనగర్లోని ఇందిరా భవన్లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని నిలదీశారు. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకోని భాజపా నాయకులు.. ఇప్పుడెలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అంబానీ, అదానీకి దోచిపెడుతోంది.. తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు.
‘‘నరేంద్ర మోదీ సర్కారు విభజన హామీలు అమలు చేయలేదు. వస్త్రాలపై 12 శాతం జీఎస్టీ విధించారు. నా తల్లిని అవమానించేలా ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారు? మోదీ ఏమైనా చేస్తే ఆయన ఫొటోతో ఓట్లు అడగండి.. రాముడి ఫొటోతో కాదు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలి. ప్రకృతి వైపరీత్యాలు, కరవుతో నష్టపోయిన రైతులను కేంద్రం ఎందుకు ఆదుకోవడం లేదు? ఎన్నికలు రాగానే ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ ఈ ఐదేళ్లు ఎక్కడికి పోయారు? అమలు చేయని హామీలపై చర్చకు భాజపా నేతలు సిద్ధమా? రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వడానికి మనసు రాలేదా?’’ అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయం జెఫ్ బెజోస్ నుంచే నేర్చుకున్నా
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత