Lok sabha elections: వివాదాలున్నా, కేసుల్లో ఇరుక్కున్నా.. విజయం దిశగా..!
ఎన్నికల సమయంలో పలు కేసులు, వివాదాలతో వార్తల్లో నిలిచిన కొందరు అభ్యర్థులు కౌంటింగ్ వేళలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: సార్వత్రిక ఎన్నికల భేరి మోగక ముందునుంచి, ఎన్నికలు జరిగిన సమయంలో దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరిని పలు కేసులు వెంటాడాయి. అసలు పార్టీలు తమకు టికెట్ ఇస్తాయో, లేదో..? అన్న పరిస్థితి ఎదుర్కొన్నవారున్నారు. అలాంటివారు టికెట్ దక్కించుకొని, విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆ స్థానాలు, అభ్యర్థులు ఎవరో చూద్దామా..?(lok sabha elections 2024)
- హాసన: పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన సిటింగ్ నియోజకవర్గంలో లీడింగ్లో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ కేసు.. కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది. అయితే హాసనలో ఓటింగ్ పూర్తయిన తర్వాత అభ్యంతరకర వీడియోల వ్యవహారం వైరల్ అయింది. అందుకే ఓటర్ల నిర్ణయంపై ఆ కేసు ప్రభావం చూపకపోయుండొచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి శ్రేయస్ పాటిల్ పోటీపడ్డారు.
- ఖదూర్ సాహెబ్: ఏడాది క్రితం పంజాబ్లో వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చి కలకలం రేపిన ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్లోని ఖదూర్ సాహెబ్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. కౌంటింగ్ వేళ..అతడు ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు డిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరా పోటీపడిన సంగతి తెలిసిందే.
- కృష్ణానగర్: పశ్చిమబెంగాలోని కృష్ణానగర్ లోక్సభ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా.. రాజమాత అమృతారాయ్పై ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు రావడంతో గతేడాది ఆమెను లోక్సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి ఆమెకు టికెట్ దక్కుతుందో, లేదోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ఆ స్థానం నుంచి మహువానే నిలబెట్టారు.
- సందేశ్ఖాలీ: పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)(సస్పెన్షన్కు గురైన)కు చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో ఎన్నికల వేళ టీఎంసీ తీవ్ర ఇరకాటంలో పడింది. మరోవైపు ఆ అకృత్యాలకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రేఖా పత్రాకు భాజపా తన అభ్యర్థిగా ప్రకటించింది. సందేశ్ఖాలీ గ్రామం ఉన్న బసిర్హట్ స్థానం నుంచి ఆమెను నిలబెట్టింది. షేక్ నరుల్ ఇస్లామ్ను టీఎంసీ బరిలో ఉంచింది. దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో నరుల్ ఆధిక్యం ప్రదర్శిస్తుండటం గమనార్హం. రేఖ వెనకంజలో ఉన్నారు.
- ఫరీద్కోట్: లోక్సభ ఎన్నికల కౌంటింగ్ వేళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా ముందంజలో ఉన్నారు. పంజాబ్లోని ఫరీద్కోట్లో తన సమీప ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 50 వేలకుపైగా ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖల్సా స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడ్డారు. అయితే ఆయన బరిలో ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.