Prem Singh Tamang: గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?
సిక్కింలో మొత్తం 32 స్థానాలకు గానూ 31 చోట్ల విజయం సాధించిన కాంత్రికారీ మోర్చా.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రేమ్సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఈశాన్య రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో (Sikkim Assembly Elections)సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 స్థానాలకు గానూ 31 చోట్ల విజయం సాధించింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF)ను కోలుకోలేని దెబ్బకొట్టింది. 25 ఏళ్లపాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిని రుచి చూపించిన ఎస్కేఎం అధ్యక్షుడు, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem singh tamang).. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అయితే, ఈ విజయాల వెనుక ఆయన అవిరళ కృషి, పట్టుదల, శ్రమ దాగి ఉన్నాయి.
ఉపాధ్యాయుడిగా ప్రయాణం ప్రారంభించి..
ప్రేమ్ సింగ్ తమాంగ్.. అందరికీ పీఎస్ గోలేగా సుపరిచితుడు. 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. 1990లో ప్రభుత్వపాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల పాటు పాఠాలు బోధించి.. సామాజిక సేవపై ఆసక్తి చూపించారు. క్రమంగా రాజకీయం వైపు మళ్లారు. 1994లో పవన్ చామ్లింగ్ స్థాపించిన సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్లో చేరి, కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎస్డీఎఫ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు వివిధ మంత్రిత్వశాఖలను నిర్వహించారు.
రాజకీయ గురువుపై తిరుగుబావుటా
2009 ఎన్నికల తర్వాత ఆయనకు పార్టీతో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలుపొందినా.. పవన్ చామ్లింగ్ మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. దానికి బదులుగా పరిశ్రమల శాఖ ఛైర్పర్సన్గా నామినేట్ చేశారు. దీనిని తిరస్కరించిన తమాంగ్.. చామ్లింగ్ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ.. రాజకీయ గురువుపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. 2009 డిసెంబర్ 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ సమావేశమే ఎస్డీఎఫ్ పతనానికి పునాది అయ్యింది. తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. 2013లో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) పేరుతో పార్టీని స్థాపించారు.
తొలి ప్రయత్నంలోనే 10 సీట్లు
పార్టీ ఏర్పాటైన ఏడాది కాలంలో ఎన్నికల పండగొచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్కేఎం అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీకి దిగింది. మొత్తం 32 స్థానాలకు గానూ 10 స్థానాలను గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇదే అదునుగా భావించిన చామ్లింగ్ ప్రభుత్వం తమాంగ్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించింది. 1994-1999 మధ్య కాలంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. రూ.10 లక్షల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారన్న అభియోగంపై జైలుకు పంపింది. దిగువ స్థాయి కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేసినా ఫలితం లేకపోయింది.
ప్రజల గుండెల్లో దేవుడు
ప్రభుత్వ నియంతృత్వ చర్యలతో తమాంగ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. తన రాజకీయ గురువు చామ్లింగ్పై తిరుగుబావుటా ఎగరేయడం వల్లే ఆయన్ని జైలుకు పంపించారని ప్రజలు బలంగా విశ్వసించారు. 2018లో జైలు నుంచి విడుదలైన తమాంగ్కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్కేఎం 17 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఎన్నికల్లో తమాంగ్ పోటీ చేయలేదు. తనపై కేసు ఉండటంతో ఒకవేళ విజయం సాధించినా.. అది చెల్లుబాటు అవుతుందో లేదో అనే సంశయంలో ఉండిపోయారు.
తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం
ఎలాగైతేనేమి.. 25 ఏళ్ల ఎస్డీఎఫ్ పాలనకు చరమగీతం పాడుతూ.. 2019, మార్చి 27న తొలిసారిగా తమాంగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించి సీఎం పదవిని పదిలం చేసుకున్నారు. తన పాలనతో సిక్కిం ప్రజల అభిమానాన్ని చూరగొన్న తమాంగ్కు అక్కడి ప్రజలు తాజాగా రెండో సారి పట్టం గట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో 31 స్థానాలను కట్టబెట్టారు.తమాంగ్కు రాజకీయ గురువైన చామ్లింగ్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల