Purandeswari: వైకాపా రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులే: పురందేశ్వరి

వైకాపా రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.

Updated : 31 Mar 2024 18:25 IST

అమరావతి: వైకాపా రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్‌ పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

బీసీలపై కనీస సానుభూతి లేని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కొనసాగడం అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2లక్షల రుణ భారం ఉందన్నారు. ఇవన్నీ చాలవన్నట్టుగా సచివాలయం, రాష్ట్రంలో గనులు కూడా తనఖా పెడుతున్నారని విమర్శించారు. పైగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మద్యం నియంత్రణ అని చెప్పి.. ఏరులై పారించారని ధ్వజమెత్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు