Chandrababu: తెదేపా-జనసేన సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
తుని: జగన్ అహంకారమే అతన్ని ముంచేసిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన ‘రా..కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే 3నెలల్లో తెదేపా-జనసేన సునామీలో వైకాపా కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ని తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించారు. తెలుగు జాతి, స్వర్ణయుగం కోసం కదలిరావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం తెదేపా-జనసేన మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జీవితంలో ఇంకెప్పుడూ జగన్ గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయం మారిందని, సైకో జగన్.. ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
‘‘కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఐదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చిందా?మూడు నెలల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. వైకాపాను చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి. జగన్ రాతి యుగం పోవాలి.. తెదేపా-జనసేన స్వర్ణయుగం రావాలి. మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటాను. వెనకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వం ఇచ్చిన పార్టీ తెదేపా. వారి కోసం జయహో బీసీ తీసుకొచ్చాం. అన్ని వర్గాలను గౌరవించే బాధ్యత తీసుకుంటాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా. తెలుగుజాతిని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత నాది. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలనేదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం చూడాలనే ఎన్టీఆర్ కలను సాకారం చేస్తాం. పేదరికం నుంచి ప్రతిఒక్కరూ బయటపడేలా చూస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు