MP Raghurama: ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి రఘురామ ఫిర్యాదు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై ఏంపీ రఘురామ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Published : 23 Feb 2024 11:45 IST

దిల్లీ: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై ఏంపీ రఘురామ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో రెండు హెలికాప్టర్లను పెట్టాలని ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఆ హెలికాప్టర్లను ఎన్నికల వేళ సీఎం జగన్‌ వినియోగించనున్నారనే వార్తల నేపథ్యంలో రఘురామ ఈసీకి ఫిర్యాదు చేశారు. అదే జరిగితే అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికే ఈ విధమైన ఏర్పాట్లు చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రఘురామ ఈసీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని